ETV Bharat / bharat

బిహార్​ బరి: తేజస్వీ ఓటమే లక్ష్యంగా భాజపా వ్యూహం

author img

By

Published : Oct 10, 2020, 2:16 PM IST

Updated : Oct 10, 2020, 3:20 PM IST

బిహార్ శాసనసభ ఎన్నికల వేళ పార్టీలు తమ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఆర్జేడీ నేత, మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్​ను తన సొంత నియోజకవర్గంలో మట్టికరిపించడమే లక్ష్యంగా భాజపా పావులు కదుపుతోంది. ఆయన పోటీ చేస్తున్న రఘోపూర్​ నియోజకవర్గంపై కాషాయదళం ప్రత్యేక దృష్టి సారించింది. మోదీ మేనియాతో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది భాజపా.

bihar-elections
బిహార్​ బరి: 'తేజస్వీ'ని మట్టికరిపించడమే భాజపా లక్ష్యం!

మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి.. ఆర్జేడీ యువ నాయకుడు తేజస్వీ యాదవ్ అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేసేందుకు భాజపా ప్రణాళికలు రచిస్తోంది. ఆయన సొంత నియోజకవర్గం, ఆర్జేడీ కంచుకోటగా ఉన్న రఘోపూర్​లోనే ఓడించేందుకు భాజపా కంకణం కట్టుకుంది. అందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయి ప్రణాళికతో.. పక్కా వ్యూహాలు అమలు చేస్తున్నారు కమలనాథులు.

అన్నీ తానై నడిపిస్తున్నారు...

లాలూ ప్రసాద్​ యాదవ్​ జైలు పాలైన తర్వాత.. ఆర్జేడీని అన్నీ తానై నడిపిస్తున్నారు తేజస్వీ యాదవ్. తాజా ఎన్నికల్లో ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి సీఎం నితీశ్​ కుమార్​కు సవాల్​ విసురుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటి ఈసారి ఎలాగైనా అధికారం ఒడిసిపట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న ఆయన.. లాలూ కుటుంబానికి కీలకంగా ఉన్న రఘోపూర్​ నుంచే మరోసారి బరిలోకి దిగుతున్నారు. అయితే ఎన్డీఏ పొత్తులో భాగంగా ఈ స్థానం భాజపాకు దక్కింది.

క్షేత్రస్థాయి అడుగులు

ఇప్పటికీ భాజపా ఈ స్థానంలో అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రత్యేక దృష్టి సారించిన పార్టీ అధిష్ఠానం.. కీలక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ఎంపిక చేయనుంది. ప్రస్తుతం ఈ స్థానంలో సిట్టింగ్​ ఎమ్మెల్యేగా ఉన్న తేజస్వీ యాదవ్​ను ఓడించటమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది కమలదళం.

ఇప్పటికే.. పార్టీకి నమ్మకంగా పని చేసిన కీలకమైన కార్యకర్తలను రంగంలోకి దించింది. రఘోపూర్​లో సామాజిక వర్గాల సమీకరణల ఆధారంగా వ్యూహ రచన చేస్తోంది. క్షేత్రస్థాయిలో.. పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను విధేయులకు అప్పగించింది. తేజస్వీ యాదవ్​ను మట్టికరిపించటమే లక్ష్యంగా పని చేస్తున్నారు భాజపా కార్యకర్తలు, నాయకులు.

పునరావృతం చేయాలనే పట్టుదల..

అయితే, గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో.. ఈ నియోజకవర్గంలో 242 ఓట్ల స్వల్ప అధిక్యమే సాధించింది ఆర్జేడీ. 2010లో తేజస్వీ యాదవ్​ తల్లి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి.. జేడీయూ అభ్యర్థి సతీష్​ కుమార్​ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఇదే ఫలితం పునరావృతం చేయాలని భాజపా చూస్తోంది.

మోదీ-పొత్తు

ప్రస్తుతం భాజపా.. ప్రధాని నరేంద్ర మోదీ ఛరిష్మాతో బిహార్​లో ఘనవిజయం సాధించాలని తపిస్తుంది. బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ పనితీరు తమకు కలిసొస్తుందని ఆశాభావంతో ఉంది.

ఎన్డీఏ పొత్తులో భాగంగా.. 121 స్తానాల్లో పోటీ చేస్తన్న భాజపా, 11 స్థానాలు వికాస్​శీల్ ఇన్సాన్ పార్టీకి కేటాయించింది.

మొత్తం 243 స్థానాలున్న బిహార్​ అసెంబ్లీకి తొలివిడత పోలింగ్​.. అక్టోబర్​ 28న జరగనుంది. నవంబర్​ 3న రెండో విడత, 7న ముడో విడత పోలింగ్​ జరగనుండగా.. నవంబర్​ 10న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి: అభ్యర్థుల ఎంపికలో నితీశ్ 'సోషల్​ ఇంజినీరింగ్'​ మంత్రం

ఇదీ చూడండి: కరోనా కారణంగా బిహార్​ ఎన్నికల రూల్స్​లో మార్పు

మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి.. ఆర్జేడీ యువ నాయకుడు తేజస్వీ యాదవ్ అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేసేందుకు భాజపా ప్రణాళికలు రచిస్తోంది. ఆయన సొంత నియోజకవర్గం, ఆర్జేడీ కంచుకోటగా ఉన్న రఘోపూర్​లోనే ఓడించేందుకు భాజపా కంకణం కట్టుకుంది. అందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయి ప్రణాళికతో.. పక్కా వ్యూహాలు అమలు చేస్తున్నారు కమలనాథులు.

అన్నీ తానై నడిపిస్తున్నారు...

లాలూ ప్రసాద్​ యాదవ్​ జైలు పాలైన తర్వాత.. ఆర్జేడీని అన్నీ తానై నడిపిస్తున్నారు తేజస్వీ యాదవ్. తాజా ఎన్నికల్లో ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి సీఎం నితీశ్​ కుమార్​కు సవాల్​ విసురుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటి ఈసారి ఎలాగైనా అధికారం ఒడిసిపట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న ఆయన.. లాలూ కుటుంబానికి కీలకంగా ఉన్న రఘోపూర్​ నుంచే మరోసారి బరిలోకి దిగుతున్నారు. అయితే ఎన్డీఏ పొత్తులో భాగంగా ఈ స్థానం భాజపాకు దక్కింది.

క్షేత్రస్థాయి అడుగులు

ఇప్పటికీ భాజపా ఈ స్థానంలో అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రత్యేక దృష్టి సారించిన పార్టీ అధిష్ఠానం.. కీలక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ఎంపిక చేయనుంది. ప్రస్తుతం ఈ స్థానంలో సిట్టింగ్​ ఎమ్మెల్యేగా ఉన్న తేజస్వీ యాదవ్​ను ఓడించటమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది కమలదళం.

ఇప్పటికే.. పార్టీకి నమ్మకంగా పని చేసిన కీలకమైన కార్యకర్తలను రంగంలోకి దించింది. రఘోపూర్​లో సామాజిక వర్గాల సమీకరణల ఆధారంగా వ్యూహ రచన చేస్తోంది. క్షేత్రస్థాయిలో.. పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను విధేయులకు అప్పగించింది. తేజస్వీ యాదవ్​ను మట్టికరిపించటమే లక్ష్యంగా పని చేస్తున్నారు భాజపా కార్యకర్తలు, నాయకులు.

పునరావృతం చేయాలనే పట్టుదల..

అయితే, గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో.. ఈ నియోజకవర్గంలో 242 ఓట్ల స్వల్ప అధిక్యమే సాధించింది ఆర్జేడీ. 2010లో తేజస్వీ యాదవ్​ తల్లి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి.. జేడీయూ అభ్యర్థి సతీష్​ కుమార్​ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఇదే ఫలితం పునరావృతం చేయాలని భాజపా చూస్తోంది.

మోదీ-పొత్తు

ప్రస్తుతం భాజపా.. ప్రధాని నరేంద్ర మోదీ ఛరిష్మాతో బిహార్​లో ఘనవిజయం సాధించాలని తపిస్తుంది. బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ పనితీరు తమకు కలిసొస్తుందని ఆశాభావంతో ఉంది.

ఎన్డీఏ పొత్తులో భాగంగా.. 121 స్తానాల్లో పోటీ చేస్తన్న భాజపా, 11 స్థానాలు వికాస్​శీల్ ఇన్సాన్ పార్టీకి కేటాయించింది.

మొత్తం 243 స్థానాలున్న బిహార్​ అసెంబ్లీకి తొలివిడత పోలింగ్​.. అక్టోబర్​ 28న జరగనుంది. నవంబర్​ 3న రెండో విడత, 7న ముడో విడత పోలింగ్​ జరగనుండగా.. నవంబర్​ 10న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి: అభ్యర్థుల ఎంపికలో నితీశ్ 'సోషల్​ ఇంజినీరింగ్'​ మంత్రం

ఇదీ చూడండి: కరోనా కారణంగా బిహార్​ ఎన్నికల రూల్స్​లో మార్పు

Last Updated : Oct 10, 2020, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.