ETV Bharat / bharat

'లాక్​డౌన్​తో సగానికి తగ్గిన కరోనా వ్యాప్తి రేటు'

దేశంలో విధించిన లాక్​డౌన్​ కారణంగా కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గిందని వెల్లడించింది కేంద్రం. లాక్​డౌన్​కు ముందు కేసుల రెట్టింపునకు 3 రోజులు పడితే.. ప్రస్తుతం దాదాపుగా వారం రోజులు పడుతున్నట్లు తెలిపింది. దేశంలో కరోనా నుంచి 80 శాతం మంది కోలుకుంటున్నారని ప్రకటించింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్​ మెరుగైన స్థితిలో ఉన్నట్లు పునరుద్ఘాటించింది.

author img

By

Published : Apr 17, 2020, 5:11 PM IST

doubling rate
కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్

దేశవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​తో కరోనా వ్యాప్తి తగ్గుతోందని పేర్కొంది కేంద్రం. లాక్​డౌన్​ విధించకముందు కరోనా కేసులు రెట్టింపు అయ్యేందుకు 3 రోజులు పడితే.. ప్రస్తుతం 6.2 రోజులు పడుతోందని పేర్కొన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​.

19 రాష్ట్రాల్లో తక్కువే..

కేసుల రెట్టింపు రేటు జాతీయ సగటుతో పొలిస్తే 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తక్కువగా ఉన్నట్లు తెలిపారు అగర్వాల్​. కేరళలో ఈ రేటు అత్యల్పంగా ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరాఖండ్​, హరియాణా, హిమాచల్​ప్రదేశ్​, చండీగఢ్​, లద్దాఖ్​, పుదుచ్చేరి, దిల్లీ, బిహార్​, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​, ఉత్తర్​ప్రదేశ్​, పంజాబ్​, అస్సోం, త్రిపురా ఉన్నాయని వెల్లడించారు. వాక్సిన్​ అభివృద్ధి చేసే పనులను వేగవంతం చేయటంపైనే దృష్టిసారించినట్లు తెలిపారు అగర్వాల్​. బీసీడీ, ప్లాస్మా థెరపీ వంటి చికిత్సలను పరిశీలిస్తున్నామన్నారు.

80శాతం మంది..

దేశంలో ప్రస్తుతం నమోదైన కేసుల్లో 13.6 శాతం మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపారు అగర్వాల్​. కొవిడ్​-19 నుంచి కోలుకున్న, మరణించిన వారి నిష్పత్తి 80:20 గా ఉన్నట్లు స్పష్టం చేశారు. అది పలు దేశాలతో పోలిస్తే అధికంగా ఉన్నట్లు తెలిపారు. మే నెల వరకు 10 లక్షల ఆర్​టీపీసీఆర్​ కిట్లను తయారు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

437 మంది మృతి..

దేశవ్యాప్తంగా గురువారం 1,007 కొత్త కేసులు నమోదు కాగా.. 23 మంది మరణించినట్లు వెల్లడించారు అగర్వాల్​. మొత్తం కేసులు 13,387కి చేరగా.. 1,749 మంది కోలుకున్నారని, మిగతా 11,201 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 437 మంది మరణించారని చెప్పారు.

ఇదీ చూడండి: రోగికి సాయం కోసం బైక్​పై 430కి.మీ ప్రయాణం

దేశవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​తో కరోనా వ్యాప్తి తగ్గుతోందని పేర్కొంది కేంద్రం. లాక్​డౌన్​ విధించకముందు కరోనా కేసులు రెట్టింపు అయ్యేందుకు 3 రోజులు పడితే.. ప్రస్తుతం 6.2 రోజులు పడుతోందని పేర్కొన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​.

19 రాష్ట్రాల్లో తక్కువే..

కేసుల రెట్టింపు రేటు జాతీయ సగటుతో పొలిస్తే 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తక్కువగా ఉన్నట్లు తెలిపారు అగర్వాల్​. కేరళలో ఈ రేటు అత్యల్పంగా ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరాఖండ్​, హరియాణా, హిమాచల్​ప్రదేశ్​, చండీగఢ్​, లద్దాఖ్​, పుదుచ్చేరి, దిల్లీ, బిహార్​, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​, ఉత్తర్​ప్రదేశ్​, పంజాబ్​, అస్సోం, త్రిపురా ఉన్నాయని వెల్లడించారు. వాక్సిన్​ అభివృద్ధి చేసే పనులను వేగవంతం చేయటంపైనే దృష్టిసారించినట్లు తెలిపారు అగర్వాల్​. బీసీడీ, ప్లాస్మా థెరపీ వంటి చికిత్సలను పరిశీలిస్తున్నామన్నారు.

80శాతం మంది..

దేశంలో ప్రస్తుతం నమోదైన కేసుల్లో 13.6 శాతం మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపారు అగర్వాల్​. కొవిడ్​-19 నుంచి కోలుకున్న, మరణించిన వారి నిష్పత్తి 80:20 గా ఉన్నట్లు స్పష్టం చేశారు. అది పలు దేశాలతో పోలిస్తే అధికంగా ఉన్నట్లు తెలిపారు. మే నెల వరకు 10 లక్షల ఆర్​టీపీసీఆర్​ కిట్లను తయారు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

437 మంది మృతి..

దేశవ్యాప్తంగా గురువారం 1,007 కొత్త కేసులు నమోదు కాగా.. 23 మంది మరణించినట్లు వెల్లడించారు అగర్వాల్​. మొత్తం కేసులు 13,387కి చేరగా.. 1,749 మంది కోలుకున్నారని, మిగతా 11,201 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 437 మంది మరణించారని చెప్పారు.

ఇదీ చూడండి: రోగికి సాయం కోసం బైక్​పై 430కి.మీ ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.