ETV Bharat / bharat

రామమందిర భూమిపూజ కార్యక్రమం షెడ్యూల్​ ఇదే

author img

By

Published : Aug 5, 2020, 5:40 AM IST

కోట్లాది మంది హిందువుల దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. అయోధ్యలో చారిత్రక రామమందిర నిర్మాణానికి కొద్ది గంటల్లో శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మధ్యాహ్నం 12:30గంటలకు ఈ భూమిపూజ కార్యక్రమం ప్రారంభం కానుంది.

AYODHYA RAM MANDIR-MODI SCHEDULE
అయోధ్యలో మోదీ పర్యటన సాగనుందిలా

అయోధ్యలో చారిత్రక రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఈ కార్యక్రమం జరగనుంది. భూమిపూజ కార్యక్రమం, అయోధ్యలో మోదీ పర్యటన ఎలా సాగుతుందో తెలిపే వివరాలు సంక్షిప్తంగా..

శంకుస్థాపన మహోత్సవం జరగనుంది ఇలా...

11:30:- ప్రధాని మోదీ అయోధ్య చేరుకుంటారు. ఆ వెంటనే హనుమాన్​గఢీ ఆలయానికి వెళతారు. 5-7 నిమిషాల పాటు అక్కడే ఉంటారు.

12:00:- రామ జన్మభూమి ప్రాంగణానికి మోదీ చేరుకుంటారు. అప్పటికే పండితులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి.

12:30:- మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు భూమి పూజ కార్యక్రమం మొదలవుతుంది. ఆ తర్వాత గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించి.. ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు మోదీ.

ప్రధాని అయోధ్య పర్యటన సాగనుందిలా..

  • ఉదయం 9:30 గంటలకు దిల్లీ నుంచి అయోధ్య బయలుదేరుతారు.
  • 10:35 లఖ్​నవూ విమానాశ్రయంలో దిగుతారు.
  • 10:40 విమానాశ్రయం నుంచి హెలికాప్టర్​లో అయోధ్యకు పయనమవుతారు.
  • 11:30 అయోధ్యలోని సాకేత్​ కాలనీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్​లో దిగుతారు.
  • 11:40 హనుమాన్ గఢీని దర్శించుకుంటారు.
  • 12:00 రామజన్మభూమి చేరుకుంటారు. 10 నిమిషాల పాటు రామ్​లల్లాను దర్శించుకుంటారు
  • 12:15 రామమందిర ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు.
  • 12:30 భూమిపూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
  • 12:40 రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
  • 1:10 స్వామి నృత్యగోపాల్​ దాస్​ సహా రామమందిర తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులతో భేటీ అవుతారు.
  • 2:05 సాకెత్ కాలనీలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
  • 2:15 లఖ్​నవూకు తిరుగుపయనమవుతారు.

అయోధ్య రామమందిర శంకుస్థాపన, ప్రధాని రాక నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.

ఇదీ చూడండి: రామ్​లల్లా వస్త్రాలంకణ బాధ్యత లాల్​ కుటుంబానిదే!

అయోధ్యలో చారిత్రక రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఈ కార్యక్రమం జరగనుంది. భూమిపూజ కార్యక్రమం, అయోధ్యలో మోదీ పర్యటన ఎలా సాగుతుందో తెలిపే వివరాలు సంక్షిప్తంగా..

శంకుస్థాపన మహోత్సవం జరగనుంది ఇలా...

11:30:- ప్రధాని మోదీ అయోధ్య చేరుకుంటారు. ఆ వెంటనే హనుమాన్​గఢీ ఆలయానికి వెళతారు. 5-7 నిమిషాల పాటు అక్కడే ఉంటారు.

12:00:- రామ జన్మభూమి ప్రాంగణానికి మోదీ చేరుకుంటారు. అప్పటికే పండితులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి.

12:30:- మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు భూమి పూజ కార్యక్రమం మొదలవుతుంది. ఆ తర్వాత గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించి.. ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు మోదీ.

ప్రధాని అయోధ్య పర్యటన సాగనుందిలా..

  • ఉదయం 9:30 గంటలకు దిల్లీ నుంచి అయోధ్య బయలుదేరుతారు.
  • 10:35 లఖ్​నవూ విమానాశ్రయంలో దిగుతారు.
  • 10:40 విమానాశ్రయం నుంచి హెలికాప్టర్​లో అయోధ్యకు పయనమవుతారు.
  • 11:30 అయోధ్యలోని సాకేత్​ కాలనీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్​లో దిగుతారు.
  • 11:40 హనుమాన్ గఢీని దర్శించుకుంటారు.
  • 12:00 రామజన్మభూమి చేరుకుంటారు. 10 నిమిషాల పాటు రామ్​లల్లాను దర్శించుకుంటారు
  • 12:15 రామమందిర ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు.
  • 12:30 భూమిపూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
  • 12:40 రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
  • 1:10 స్వామి నృత్యగోపాల్​ దాస్​ సహా రామమందిర తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులతో భేటీ అవుతారు.
  • 2:05 సాకెత్ కాలనీలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
  • 2:15 లఖ్​నవూకు తిరుగుపయనమవుతారు.

అయోధ్య రామమందిర శంకుస్థాపన, ప్రధాని రాక నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.

ఇదీ చూడండి: రామ్​లల్లా వస్త్రాలంకణ బాధ్యత లాల్​ కుటుంబానిదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.