ETV Bharat / bharat

'కరోనా అయితే నాకేంటి? నా దగ్గరకు అది రాలేదు'

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి తన దరికి చేరదని అసోంలోని ఓ రైతు నొక్కి చెబుతున్నాడు. 12 ఏళ్లుగా తన జీవన విధానమే ఇందుకు కారణమని అంటున్నాడు. మరి అతని కథేంటో మనమూ తెలుసుకుందామా?

author img

By

Published : Apr 19, 2020, 10:50 AM IST

assam
విజయ్​ బ్రహ్మ
'కరోనా అయితే నాకేంటి? నా దగ్గరికి అది రాలేదు'

ఖండాంతరాలు దాటి విస్తరించిన కరోనా మహమ్మారికి ప్రపంచమంతా వణికిపోతోంది. ఎవరి నుంచి వైరస్ వ్యాపిస్తుందోనన్న భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అసోంకు చెందిన ఓ రైతు మాత్రం తనకు కరోనా సోకదని నొక్కి వక్కాణిస్తున్నాడు.

మందు లేని ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ఉన్న ఆయుధం భౌతిక దూరం. ప్రపంచమంతా ఇదే పాటిస్తోంది. కానీ భూటాన్​ సరిహద్దులోని బాక్సా జిల్లాలో విజయ్​ బ్రహ్మ అనే రైతు.. 12 ఏళ్లుగా భౌతికంగానే కాదు, సామాజిక దూరాన్ని కూడా పాటిస్తూ.. తన పొలంలోని ఓ చెట్టుపైనే నివసిస్తున్నాడు.

12ఏళ్లుగా..

12ఏళ్ల క్రితం భార్యతో విడిపోయిన తర్వాత.. బ్రహ్మ ఏకాంత జీవితం గడపాలని నిశ్చయించుకున్నాడు. అనంతరం తన పొలంలోని ఓ చెట్టుపై నివాసం ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నాడు. అప్పటినుంచి విజయ్ ఎవరితో కలవడు. మాట్లాడడు. తన పని తాను చేసుకుంటాడు.

"నాకు కరోనా వైరస్ గురించి ఈ మధ్యనే తెలిసింది. అయినప్పటికీ ఆ వైరస్ నాకు సోకదు. నేను ఎప్పుడు ఎక్కువ మంది ఉండే ప్రదేశాలకు వెళ్లను. నేను ఇక్కడ 12 ఏళ్లుగా ఉంటున్నాను. కూరగాయలు పండిస్తూ, పశువులను పెంచుతూ జీవనాన్ని సాగిస్తున్నా. అప్పుడప్పుడు చేపలను పట్టి మార్కెట్​లో అమ్ముతాను."

-విజయ్ బ్రహ్మ, రైతు

అక్కడ సాధారణమే..

అసోంలో చెట్లపై నివాసం సాధారణమే. ముఖ్యంగా భూటాన్ సరిహద్దుల్లో ఇటువంటి నిర్మాణాలు ఎక్కువగా కనిపిస్తాయి. రాత్రివేళల్లో పొలాల్లోకి ఏనుగులు రాకుండా పెద్ద పెద్ద శబ్దాలు చేసేందుకు ఈ ఏర్పాట్లు చేసుకుంటారు అక్కడి ప్రజలు.

ఇదీ చూడండి: 'అనుమానాల్లేవ్... కరోనాపై విజయం తథ్యం'

'కరోనా అయితే నాకేంటి? నా దగ్గరికి అది రాలేదు'

ఖండాంతరాలు దాటి విస్తరించిన కరోనా మహమ్మారికి ప్రపంచమంతా వణికిపోతోంది. ఎవరి నుంచి వైరస్ వ్యాపిస్తుందోనన్న భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అసోంకు చెందిన ఓ రైతు మాత్రం తనకు కరోనా సోకదని నొక్కి వక్కాణిస్తున్నాడు.

మందు లేని ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ఉన్న ఆయుధం భౌతిక దూరం. ప్రపంచమంతా ఇదే పాటిస్తోంది. కానీ భూటాన్​ సరిహద్దులోని బాక్సా జిల్లాలో విజయ్​ బ్రహ్మ అనే రైతు.. 12 ఏళ్లుగా భౌతికంగానే కాదు, సామాజిక దూరాన్ని కూడా పాటిస్తూ.. తన పొలంలోని ఓ చెట్టుపైనే నివసిస్తున్నాడు.

12ఏళ్లుగా..

12ఏళ్ల క్రితం భార్యతో విడిపోయిన తర్వాత.. బ్రహ్మ ఏకాంత జీవితం గడపాలని నిశ్చయించుకున్నాడు. అనంతరం తన పొలంలోని ఓ చెట్టుపై నివాసం ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నాడు. అప్పటినుంచి విజయ్ ఎవరితో కలవడు. మాట్లాడడు. తన పని తాను చేసుకుంటాడు.

"నాకు కరోనా వైరస్ గురించి ఈ మధ్యనే తెలిసింది. అయినప్పటికీ ఆ వైరస్ నాకు సోకదు. నేను ఎప్పుడు ఎక్కువ మంది ఉండే ప్రదేశాలకు వెళ్లను. నేను ఇక్కడ 12 ఏళ్లుగా ఉంటున్నాను. కూరగాయలు పండిస్తూ, పశువులను పెంచుతూ జీవనాన్ని సాగిస్తున్నా. అప్పుడప్పుడు చేపలను పట్టి మార్కెట్​లో అమ్ముతాను."

-విజయ్ బ్రహ్మ, రైతు

అక్కడ సాధారణమే..

అసోంలో చెట్లపై నివాసం సాధారణమే. ముఖ్యంగా భూటాన్ సరిహద్దుల్లో ఇటువంటి నిర్మాణాలు ఎక్కువగా కనిపిస్తాయి. రాత్రివేళల్లో పొలాల్లోకి ఏనుగులు రాకుండా పెద్ద పెద్ద శబ్దాలు చేసేందుకు ఈ ఏర్పాట్లు చేసుకుంటారు అక్కడి ప్రజలు.

ఇదీ చూడండి: 'అనుమానాల్లేవ్... కరోనాపై విజయం తథ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.