ETV Bharat / bharat

త్రివేండ్రం మేయర్​గా 21 ఏళ్ల యువతి!

author img

By

Published : Dec 25, 2020, 3:20 PM IST

21 ఏళ్లకే తిరువనంతపురం మేయర్​గా​ ఆర్య రాజేంద్రన్​ బాధ్యతలు స్వీకరించనున్నారు. యువతరానికి అవకాశం కల్పించాలన్న ఆలోచనతో సీపీఎం నేతలు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.

Arya Rajendran will take charge as the mayor of Thiruvananthapuram
21 ఏళ్లకే మేయర్ పదవికి ఎన్నికైన ఆర్య రాజేంద్రన్

కేరళ రాజధాని తిరువనంతపురం మేయర్​గా ఆర్య రాజేంద్రన్(21) బాధ్యతలు చేపట్టనున్నారు. సీపీఎం జిల్లా సచివాలయ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం పూర్తయితే... కేరళలో మేయర్​ అయిన అత్యంత పిన్నవయస్కురాలిగా ఆర్య చరిత్ర సృష్టించనున్నారు.

ఆర్య రాజేంద్రన్ ప్రస్తుతం బాలసంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఎస్​ఎఫ్ఐ రాష్ట్ర కమిటీలోనూ సభ్యురాలిగా ఉన్నారు. ఇటీవల జరిగిన తిరువనంతపురం పురపాలక సంస్థ ఎన్నికల్లో ముడవన్​ముగల్​ వార్డు నుంచి సీపీఎం తరఫున పోటీ చేసి, గెలిచారు ఆర్య.

కేరళ రాజధాని తిరువనంతపురం మేయర్​గా ఆర్య రాజేంద్రన్(21) బాధ్యతలు చేపట్టనున్నారు. సీపీఎం జిల్లా సచివాలయ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం పూర్తయితే... కేరళలో మేయర్​ అయిన అత్యంత పిన్నవయస్కురాలిగా ఆర్య చరిత్ర సృష్టించనున్నారు.

ఆర్య రాజేంద్రన్ ప్రస్తుతం బాలసంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఎస్​ఎఫ్ఐ రాష్ట్ర కమిటీలోనూ సభ్యురాలిగా ఉన్నారు. ఇటీవల జరిగిన తిరువనంతపురం పురపాలక సంస్థ ఎన్నికల్లో ముడవన్​ముగల్​ వార్డు నుంచి సీపీఎం తరఫున పోటీ చేసి, గెలిచారు ఆర్య.

ఇదీ చదవండి : 'కేరళ, బంగాల్​లో రైతు నిరసనలు ఎందుకు లేవు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.