- పశ్చిమ బెంగాల్లో 200 మంది ప్రైవేటు వ్యక్తులు స్థాపించిన సంస్థే శారదా చిట్ఫండ్. పది లక్షల మందికి పైగా పెట్టుబడిదారులను మోసం చేసి ఏప్రిల్ 2013లో బయటపడింది.
- చిన్న మదుపుదార్లను ఆర్థికంగా రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 500కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది.
- 2013 ఏప్రిల్ 23న సంస్థ ఛైర్మన్, ఎండీ సుదీప్త సేన్తో పాటు దేబ్జని ముఖర్జీ, అరవింద్ సింగ్ చౌహాన్ను పోలీసులు కశ్మీర్లో అదుపులోకి తీసుకున్నారు.
- సుదీప్ సేన్ ఇందులో తృణముల్ ఎంపీలకు కుంభకోణంలో భాగస్వామ్యం ఉందంటూ పోలీసుల విచారణలో వెల్లడించారు.
- సుదీప్ సేన్ అరెస్టు అనంతరం సెబీ... మూలధనాన్ని మోసపోయిన వారికి 3 నెలల్లో ఇవ్వాలంటూ శారదా సంస్థకు నోటీసులు ఇచ్చింది.
- కుంభకోణం వెనుక పెద్దల హస్తం ఉందని ఆదాయపు పన్ను, ఈడీ, సీబీఐ రంగంలోకి దిగాయి.
- మాజీ మంత్రి మంతన్ సింగ్ భార్యకు కుంభకోణంతో సంబంధం ఉందన్న ఆరోపణలపై ప్రముఖ న్యాయవాది, చిదంబరం భార్య నళిని చిదంబరం వాదించింది. కేసు వాదనకు గాను నళిని రూ.1.26 కోట్ల శారద ధనం స్వీకరించిందని ఈడీ కేసు నమోదు చేసింది.
- శారద కుంభకోణంపై ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసానికి రాగా రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కొంత కాలం బంధించి విడుదల చేశారు.
- ఈ చర్యలపై పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజ్యాంగం, రాజ్యాంగ సంస్థలను కేంద్రం నిర్విర్యం చేస్తోందంటూ ఆదివారం రాత్రి ధర్నా చేపట్టారు.
