ETV Bharat / bharat

అయోధ్య తీర్పునకు యావత్​ భారతావని సమ్మతి

author img

By

Published : Nov 10, 2019, 5:05 AM IST

Updated : Nov 10, 2019, 7:21 AM IST

అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసులో సుప్రీం కోర్టు తీర్పును యావత్​ భారతవాని స్వాగతించింది. హిందూ, ముస్లిం పక్షాలు సహా తీర్పును గౌరవిస్తున్నట్లు కక్షిదారులు పేర్కొన్నారు. సుప్రీం తీర్పు పూర్తి పాఠాన్ని విశ్లేషించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధం కానున్నారు.

అయోధ్య తీర్పునకు యావత్​ భారతావని సమ్మతి

అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. ఏళ్లతరబడి నలుగుతున్న వివాదానికి ముగింపు పలికింది. ఈ కేసులో ప్రధానంగా ఉన్న ముగ్గురు కక్షిదారులు తీర్పుపై సంతృప్తి వ్యక్తం చేశారు. హిందూ, ముస్లిం పక్షాలు తీర్పును స్వాగతించాయి.

ప్రజల విజయం..

ప్రధాన పిటిషనర్‌ రామ్‌లల్లా విరాజ్‌మాన్‌ తీర్పును స్వాగతిస్తూ ఇది ప్రజల విజయమని పేర్కొంది. తీర్పు సమతూకంతో ఉందని.. ఏ ఒక్కరి పక్షానో నిలిచినట్టులేదని తెలిపింది. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ చేపడతామని వెల్లడించింది.

లక్ష్యం నెరవేరింది..

సుప్రీం తీర్పుపై స్పందించిన నిర్మోహి అఖాడా దీనిపై తమకు ఎలాంటి అసంతృప్తి లేదని తెలిపింది. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా తమ లక్ష్యం నెరవేరిందని నిర్మోహి అఖాడా సభ్యుడు మహంత్‌ ధర్మదాస్‌ అన్నారు. రామమందిర నిర్మాణంలో రామ్‌లల్లా విరాజ్‌మాన్‌కు సహకరిస్తామని తెలిపారు. ఈ విషయంలో ఎవరూ విజయం సాధించినట్టుకాదని అలాగే పరాజయం పొందినట్టు భావించరాదని అన్నారు.

సున్నీ వక్ఫ్​బోర్డ్​..

ఈ కేసులో ముస్లింల తరఫున పిటిషనర్‌గా ఉన్న సున్నీ వక్ఫ్‌ బోర్డు న్యాయవాది జఫర్‌ యాబ్‌ జిలానీ తొలుత తీర్పుపై అసంతృప్తి ప్రకటించారు. సమీక్షకు వెళ్తామని అన్నారు. అయితే ఉత్తర్​ప్రదేశ్​ సున్నీ వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ జఫర్ అహ్మద్‌ ఫారూకీ మాత్రం సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. తీర్పుపై సమీక్షకు వెళ్లే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. తీర్పుపై సమీక్షకు వెళ్తున్నట్టు ఎవరైనా చెబితే అందులో వాస్తవం లేదని అన్నారు. ఫారూకీ వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన జఫర్‌ యాబ్‌ జిలానీ తాను ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు కార్యదర్శిగా స్పందించానని.. సున్నీ వక్ఫ్‌ బోర్డు న్యాయవాదిగా కాదని అన్నారు.

జాతీయ మైనారిటీ కమిషన్ సంతృప్తి

సుప్రీం తీర్పుపై సున్నీ వక్ఫ్ బోర్డు, ఎంఐఎం అసంతృప్తి వ్యక్తం చేయగా జాతీయ మైనారిటీ కమిషన్‌ సంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీం తీర్పుతో ముస్లింలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు ఎన్​సీఎం చైర్‌ పర్సన్‌ గైరుల్‌ హసన్ రిజ్వీ. సున్నీ వక్ఫ్ బోర్డు వ్యాఖ్యల్ని తోసిపుచ్చిన ఎన్​సీఎం ఇంతకన్నా మంచి తీర్పు వస్తుందని ఆశించలేమన్నారు. ఈ తీర్పు జాతీయ సమగ్రతకు సోదర భావానికి, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని వెల్లడించారు.

స్వాగతించిన అజ్మేర్ దర్గా

అయోధ్యపై వెలువడిన చారిత్రక తీర్పును రాజస్థాన్‌లోని ప్రముఖ అజ్మేర్‌ దర్గా స్వాగతించింది. తీర్పు నేపథ్యంలో ప్రజలు సంయమనం పాటించాలని దర్గా మతపెద్ద దీవాన్‌ జైనులబ్దీన్‌ అలీఖాన్‌ కోరారు. 'న్యాయవ్యవస్థ అత్యున్నతమైంది. అయోధ్యపై తీర్పు ప్రతి ఒక్కరూ గౌరవించాలి. యావత్ ప్రపంచం భారత్‌ వైపే చూస్తోంది . మనదేశ ఏకత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన సమయమిది' అని అన్నారాయన. ఈ తీర్పు నేపథ్యంలో మనమెంత శాంతికాముకులమో తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు అలీఖాన్‌.

సహకరించుకోవాలి..

అయోధ్య కేసు తీర్పును స్వాగతించారు కర్ణాటకలోని పెజవార్​ మఠ్​కు చెందిన విశ్వేష తీర్థ స్వామి. మసీదు నిర్మాణానికి హిందువులు సహకరించాలని సూచించారు. అలాగే రామమందిరం నిర్మాణాకి ముస్లింలూ సహకరించాలని కోరారు. దీని ద్వారా ప్రతిఒక్కరు ఐక్యంగా ఉండాలన్నారు.

సమీక్ష పిటిషన్​కు నో..

అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు తీర్పును అంగీకరిస్తున్నామని తెలిపారు దిల్లీలోని జామా మసీదు సయ్యద్​ అహ్మద్​ బుఖారీకి చెందిన షాహి ఇమామ్​. దేశం అభివృద్ధి వైపు పయనిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సమీక్ష పిటిషన్​ దాఖలు చేసే నిర్ణయంతో తాము ఏకీభవించబోమన్నారు.

చారిత్రక తీర్పు..

అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించిందని రామ్​ దేవ్​ బాబా పేర్కొన్నారు. ముస్లింలకు ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల స్థలం కేటాయింటడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. మసీదు నిర్మాణానికి హిందూ సోదరులు సహకరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తీర్పు నేపథ్యంలో త్వరలోనే రామమందిరం నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.

విశ్వహిందూ పరిషత్​...

సుప్రీంకోర్టు తీర్పు..అయోధ్యలో రామమందిర నిర్మాణం దిశగా నిర్ణయాత్మక అడుగుగా విశ్వహిందూ పరిషత్ అభివర్ణించింది. ట్రస్టు ఏర్పాటు తదితర అంశాలపై వేగంగా చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని కోరింది. రామ మందిర నిర్మాణానికి సంబంధించి 60శాతం పిల్లర్లు, దూలాలు సిద్ధంగా ఉన్నట్లు వివరించిన వీహెచ్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్‌కుమార్.. కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఇరు వర్గాలకు ఉపశమనం..

అయోధ్య విషయంలో సుప్రీం కోర్టు తీర్పు దేశ గౌరవాన్ని మరింత పెంచిందని ఆధ్యాత్మిక గురువు, మధ్యవర్తిత్వ కమిటీ సభ్యుడు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. తీర్పును స్వాగతించిన శ్రీశ్రీ రవిశంకర్.. సుప్రీం కోర్టు ఇరు వర్గాల ప్రజలకూ న్యాయం చేకూరేలా తీర్పు వెలువరించటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్యకు సరైన ముగింపు లభించిందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అయోధ్య తీర్పును స్వాగతించిన విపక్షాలు

అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. ఏళ్లతరబడి నలుగుతున్న వివాదానికి ముగింపు పలికింది. ఈ కేసులో ప్రధానంగా ఉన్న ముగ్గురు కక్షిదారులు తీర్పుపై సంతృప్తి వ్యక్తం చేశారు. హిందూ, ముస్లిం పక్షాలు తీర్పును స్వాగతించాయి.

ప్రజల విజయం..

ప్రధాన పిటిషనర్‌ రామ్‌లల్లా విరాజ్‌మాన్‌ తీర్పును స్వాగతిస్తూ ఇది ప్రజల విజయమని పేర్కొంది. తీర్పు సమతూకంతో ఉందని.. ఏ ఒక్కరి పక్షానో నిలిచినట్టులేదని తెలిపింది. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ చేపడతామని వెల్లడించింది.

లక్ష్యం నెరవేరింది..

సుప్రీం తీర్పుపై స్పందించిన నిర్మోహి అఖాడా దీనిపై తమకు ఎలాంటి అసంతృప్తి లేదని తెలిపింది. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా తమ లక్ష్యం నెరవేరిందని నిర్మోహి అఖాడా సభ్యుడు మహంత్‌ ధర్మదాస్‌ అన్నారు. రామమందిర నిర్మాణంలో రామ్‌లల్లా విరాజ్‌మాన్‌కు సహకరిస్తామని తెలిపారు. ఈ విషయంలో ఎవరూ విజయం సాధించినట్టుకాదని అలాగే పరాజయం పొందినట్టు భావించరాదని అన్నారు.

సున్నీ వక్ఫ్​బోర్డ్​..

ఈ కేసులో ముస్లింల తరఫున పిటిషనర్‌గా ఉన్న సున్నీ వక్ఫ్‌ బోర్డు న్యాయవాది జఫర్‌ యాబ్‌ జిలానీ తొలుత తీర్పుపై అసంతృప్తి ప్రకటించారు. సమీక్షకు వెళ్తామని అన్నారు. అయితే ఉత్తర్​ప్రదేశ్​ సున్నీ వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ జఫర్ అహ్మద్‌ ఫారూకీ మాత్రం సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. తీర్పుపై సమీక్షకు వెళ్లే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. తీర్పుపై సమీక్షకు వెళ్తున్నట్టు ఎవరైనా చెబితే అందులో వాస్తవం లేదని అన్నారు. ఫారూకీ వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన జఫర్‌ యాబ్‌ జిలానీ తాను ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు కార్యదర్శిగా స్పందించానని.. సున్నీ వక్ఫ్‌ బోర్డు న్యాయవాదిగా కాదని అన్నారు.

జాతీయ మైనారిటీ కమిషన్ సంతృప్తి

సుప్రీం తీర్పుపై సున్నీ వక్ఫ్ బోర్డు, ఎంఐఎం అసంతృప్తి వ్యక్తం చేయగా జాతీయ మైనారిటీ కమిషన్‌ సంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీం తీర్పుతో ముస్లింలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు ఎన్​సీఎం చైర్‌ పర్సన్‌ గైరుల్‌ హసన్ రిజ్వీ. సున్నీ వక్ఫ్ బోర్డు వ్యాఖ్యల్ని తోసిపుచ్చిన ఎన్​సీఎం ఇంతకన్నా మంచి తీర్పు వస్తుందని ఆశించలేమన్నారు. ఈ తీర్పు జాతీయ సమగ్రతకు సోదర భావానికి, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని వెల్లడించారు.

స్వాగతించిన అజ్మేర్ దర్గా

అయోధ్యపై వెలువడిన చారిత్రక తీర్పును రాజస్థాన్‌లోని ప్రముఖ అజ్మేర్‌ దర్గా స్వాగతించింది. తీర్పు నేపథ్యంలో ప్రజలు సంయమనం పాటించాలని దర్గా మతపెద్ద దీవాన్‌ జైనులబ్దీన్‌ అలీఖాన్‌ కోరారు. 'న్యాయవ్యవస్థ అత్యున్నతమైంది. అయోధ్యపై తీర్పు ప్రతి ఒక్కరూ గౌరవించాలి. యావత్ ప్రపంచం భారత్‌ వైపే చూస్తోంది . మనదేశ ఏకత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన సమయమిది' అని అన్నారాయన. ఈ తీర్పు నేపథ్యంలో మనమెంత శాంతికాముకులమో తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు అలీఖాన్‌.

సహకరించుకోవాలి..

అయోధ్య కేసు తీర్పును స్వాగతించారు కర్ణాటకలోని పెజవార్​ మఠ్​కు చెందిన విశ్వేష తీర్థ స్వామి. మసీదు నిర్మాణానికి హిందువులు సహకరించాలని సూచించారు. అలాగే రామమందిరం నిర్మాణాకి ముస్లింలూ సహకరించాలని కోరారు. దీని ద్వారా ప్రతిఒక్కరు ఐక్యంగా ఉండాలన్నారు.

సమీక్ష పిటిషన్​కు నో..

అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు తీర్పును అంగీకరిస్తున్నామని తెలిపారు దిల్లీలోని జామా మసీదు సయ్యద్​ అహ్మద్​ బుఖారీకి చెందిన షాహి ఇమామ్​. దేశం అభివృద్ధి వైపు పయనిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సమీక్ష పిటిషన్​ దాఖలు చేసే నిర్ణయంతో తాము ఏకీభవించబోమన్నారు.

చారిత్రక తీర్పు..

అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించిందని రామ్​ దేవ్​ బాబా పేర్కొన్నారు. ముస్లింలకు ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల స్థలం కేటాయింటడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. మసీదు నిర్మాణానికి హిందూ సోదరులు సహకరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తీర్పు నేపథ్యంలో త్వరలోనే రామమందిరం నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.

విశ్వహిందూ పరిషత్​...

సుప్రీంకోర్టు తీర్పు..అయోధ్యలో రామమందిర నిర్మాణం దిశగా నిర్ణయాత్మక అడుగుగా విశ్వహిందూ పరిషత్ అభివర్ణించింది. ట్రస్టు ఏర్పాటు తదితర అంశాలపై వేగంగా చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని కోరింది. రామ మందిర నిర్మాణానికి సంబంధించి 60శాతం పిల్లర్లు, దూలాలు సిద్ధంగా ఉన్నట్లు వివరించిన వీహెచ్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్‌కుమార్.. కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఇరు వర్గాలకు ఉపశమనం..

అయోధ్య విషయంలో సుప్రీం కోర్టు తీర్పు దేశ గౌరవాన్ని మరింత పెంచిందని ఆధ్యాత్మిక గురువు, మధ్యవర్తిత్వ కమిటీ సభ్యుడు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. తీర్పును స్వాగతించిన శ్రీశ్రీ రవిశంకర్.. సుప్రీం కోర్టు ఇరు వర్గాల ప్రజలకూ న్యాయం చేకూరేలా తీర్పు వెలువరించటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్యకు సరైన ముగింపు లభించిందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అయోధ్య తీర్పును స్వాగతించిన విపక్షాలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Basra, Iraq - 9 November 2019
1. Various of Iraqi security forces observing traffic
2. Humvee stationed by the side of the road
3. Various of Iraqi security forces observing traffic
4. SOUNDBITE (Arabic) Brigadier General Bassim Al Maliki, spokesperson for the Basra Police Command:
"Some cars were spotted firing. When inquiring from one of the wounded protesters, he told us that there were some people who had fired from their cars toward the demonstration and security forces. We have the numbers (vehicle registration) of these cars and we are chasing them."
5. Various of masked armed officer sat in Humvee
6. Humvee and security officer
STORYLINE:
Iraqi security forces were deployed on the streets of Basra on Saturday after protesters in the southern city stormed the Iranian consulate and torched government buildings, in violence that rocked the oil-exporting Shiite heartland and sparked alarm across a conflict-weary country.
Masked troops in combat fatigues set up checkpoints and rode through the city centre in black pickup trucks with heavy weapons mounted in the back.
Security forces in Humvees were deployed at intersections.
Angry protesters have torched government buildings and offices belonging to the Iranian-backed militias in the week-long protests demanding improved services and an end to corruption.
On Friday night protesters chanting anti-Iranian slogans including "Iran, out, out!" stormed the Iranian consulate and set it on fire.
The deployment came after an alliance of powerful Shiite militias, many of them backed by Iran, vowed to respond to the violent protests that have gripped the city for the past week, raising the threat of further violence.
At least 15 people were killed and 249 injured in clashes between protesters and security forces this week, health officials said.
Since June, Basra has been shaken by the most serious protests in the oil-rich southern region in years, with angry residents complaining of poor public services.
In recent days protests escalated as crowds turned their rage on neighbouring Iran, blaming its outsized influence in Iraq's political affairs for their misery and calling for radical change.
Iran controls powerful Shiite militias in Basra, home to some of the largest oil fields in Iraq.
Despite the oil wealth, the city has long suffered from government neglect, soaring unemployment and a crumbling infrastructure.
Over the past month, thousands of people were hospitalised after drinking polluted water.
==========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 10, 2019, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.