ETV Bharat / bharat

'ఎక్కడ చూసినా ఈవీఎంలలో లోపమే'

దేశవ్యాప్తంగా ఈవీఎంలలో లోపం ఉందని సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​ ఆరోపించారు. ఈవీఎంల లోపాలను ఎన్నికల సంఘం నేరపూరిత వైఫల్యంగా అభివర్ణించారు.

author img

By

Published : Apr 23, 2019, 6:03 PM IST

అఖిలేశ్​ యాదవ్​ ట్వీట్​

ఈవీఎంల పనితీరుపై మరోసారి విపక్షాలు విమర్శలు గుప్పించాయి. దేశంలో మూడో విడత పోలింగ్ జరుగుతున్న వేళ ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ యంత్రాల పనితీరుపై సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్ అనుమానాలు లేవనెత్తారు.

అఖిలేశ్​ యాదవ్​ ట్వీట్​
అఖిలేశ్​ యాదవ్​ ట్వీట్​

"దేశవ్యాప్తంగా ఉన్న ఈవీఎంలలో లోపం ఉంది లేదా భాజపాకు ఓటు పడుతుంది. ఎన్నికల అధికారులకు ఈవీఎంలపై సరైన శిక్షణ లేదని కలెక్టర్​ చెబుతున్నారు. 350కిపైగా ఈవీఎంలను మార్చారు. రూ.50 వేల కోట్ల ఖర్చుతో నిర్వహిస్తున్న ఎన్నికల్లో ఇది ముమ్మాటికీ ఈసీ వైఫల్యమే.
సాక్షాత్తు జిల్లా కలెక్టర్​​ చెప్పిన మాటలు మనం నమ్మాలా లేక ఎవరో చెప్పిన మాటలా?"

-అఖిలేశ్​ యాదవ్​ ట్వీట్

మూడో విడత పోలింగ్​లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం అఖిలేశ్ మీడియాతో మాట్లాడారు. రాంపుర్, బదాయు నియోజకవర్గాల్లో ఈవీఎంల లోపాలపై వస్తున్న నివేదికలను ఈసీ పరిశీలించాలని కోరారు.

"తన కూతురు పోటీ చేస్తున్నందున రాష్ట్ర మంత్రి బదాయులో పోలింగ్​ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు నాకు తెలిసింది. అధికారులు ఈవీఎంలపై యంత్రాంగానికి సరైన శిక్షణ లేదని చెబుతున్నారు. ఇదేనా ప్రభుత్వం చెబుతున్న డిజిటల్​ ఇండియా? "
-అఖిలేశ్​ యాదవ్​, సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు

ఈవీఎంల పనితీరుపై మరోసారి విపక్షాలు విమర్శలు గుప్పించాయి. దేశంలో మూడో విడత పోలింగ్ జరుగుతున్న వేళ ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ యంత్రాల పనితీరుపై సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్ అనుమానాలు లేవనెత్తారు.

అఖిలేశ్​ యాదవ్​ ట్వీట్​
అఖిలేశ్​ యాదవ్​ ట్వీట్​

"దేశవ్యాప్తంగా ఉన్న ఈవీఎంలలో లోపం ఉంది లేదా భాజపాకు ఓటు పడుతుంది. ఎన్నికల అధికారులకు ఈవీఎంలపై సరైన శిక్షణ లేదని కలెక్టర్​ చెబుతున్నారు. 350కిపైగా ఈవీఎంలను మార్చారు. రూ.50 వేల కోట్ల ఖర్చుతో నిర్వహిస్తున్న ఎన్నికల్లో ఇది ముమ్మాటికీ ఈసీ వైఫల్యమే.
సాక్షాత్తు జిల్లా కలెక్టర్​​ చెప్పిన మాటలు మనం నమ్మాలా లేక ఎవరో చెప్పిన మాటలా?"

-అఖిలేశ్​ యాదవ్​ ట్వీట్

మూడో విడత పోలింగ్​లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం అఖిలేశ్ మీడియాతో మాట్లాడారు. రాంపుర్, బదాయు నియోజకవర్గాల్లో ఈవీఎంల లోపాలపై వస్తున్న నివేదికలను ఈసీ పరిశీలించాలని కోరారు.

"తన కూతురు పోటీ చేస్తున్నందున రాష్ట్ర మంత్రి బదాయులో పోలింగ్​ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు నాకు తెలిసింది. అధికారులు ఈవీఎంలపై యంత్రాంగానికి సరైన శిక్షణ లేదని చెబుతున్నారు. ఇదేనా ప్రభుత్వం చెబుతున్న డిజిటల్​ ఇండియా? "
-అఖిలేశ్​ యాదవ్​, సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు

Bhubaneswar (Odisha), Apr 23 (ANI): Odisha Chief Minister Naveen Patnaik cast his vote in phase 3 of Lok Sabha elections on Tuesday. He cast his vote at a polling booth in Odisha's Bhubaneswar. Both Parliament and Assembly elections are being held in Odisha on Tuesday. Voting for third phase of LS elections is underway across the country.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.