ETV Bharat / bharat

ఏది నిజం...?

author img

By

Published : Mar 5, 2019, 3:47 PM IST

Updated : Mar 5, 2019, 4:16 PM IST

భారత వాయుసేన మెరుపుదాడిపై రాజకీయం ఇప్పట్లో ముగిసేలా లేదు. మృతుల సంఖ్య ఎంత? ఆధారాలేవీ? అనే అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది.

ఏది నిజం...?

భారత వైమానిక దళం పాక్​కు ముచ్చెమటలు పట్టించి వారం దాటింది. అనంతరం ఇరుదేశాల మధ్య పరిస్థితి యుద్ధవాతావరణాన్ని తలపించి ఒక్కసారిగా శాంతించింది.

జాతీయస్థాయిలో మాత్రం ఈ అంశంపై రాజకీయం తీవ్రమవుతోంది. వైమానిక దాడిలో మరణించిన ఉగ్రవాదుల సంఖ్యపై ఎలాంటి స్పష్టత లేదు. 350 అని ఒకరు, 300కు పైగా అని మరొకరు ఇలా ప్రకటనలూ చేసుకుంటూ వస్తున్నారు. జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ వైమానిక దాడి సమయంలో అక్కడ 300 ఫోన్లు క్రియాశీలకంగా ఉన్నాయని తెలిపింది. ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​​ ఒక సభలో ఈ సంఖ్య 400గా పేర్కొన్నారు.

''48 గంటలవ్యవధిలోనే ఉగ్రవాదుల్ని మన భద్రతాసిబ్బంది అంతమొందించారు. ఫిబ్రవరి 14 పుల్వామా దాడికి ప్రతిగా 40 మందికి 400 మందితో బదులు తీర్చుకున్నారు. ''

- యోగి ఆదిత్యనాథ్​, ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి

ఇటీవలే కేంద్రమంత్రి అహ్లువాలియా వైమానిక దాడి మృతుల సంఖ్యను ప్రధాని మోదీ ఎప్పుడూ ధ్రువీకరించలేదన్నారు. ఈ వ్యాఖ్యలు విపక్షాల విమర్శలకు తావిచ్చాయి. అసలెంత మంది చనిపోయారో నిగ్గు తేల్చాల్సిందేనని పట్టుబడుతున్నాయి ప్రతిపక్షాలు.

విపక్షాల దాడి...

మెరుపుదాడులపై వరుసగా కాంగ్రెస్​ సీనియర్​ నేతలు మోదీపై ప్రశ్నల వర్షం కురిపించారు. సాక్ష్యాధారాలతో సహా నిరూపించాల్సిందేనని కపిల్​సిబల్​ ట్వీట్​ చేశారు. అంతర్జాతీయ మీడియా ఆధారాలు లేవంటుంది... దీనికి బదులివ్వండి అని మోదీని కోరారు. కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా... కేంద్రమంత్రి అహ్లువాలియా వ్యాఖ్యలపై స్పష్టతనివ్వాలని మోదీని డిమాండ్​ చేశారు.

ప్రతిపక్షాల ఆరోపణలకు అదే స్థాయిలో దీటుగా బదులిస్తోంది అధికార భాజపా. కాంగ్రెస్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని ఎదురుదాడి చేస్తోంది. ఇది​ జవాన్లను అవమానించడమే అని ఎప్పటికప్పుడు ధ్వజమెత్తుతోంది.

undefined

సొంత పార్టీ నుంచే...

భాజపా సీనియర్​ నాయకులు వివిధ సమావేశాల్లో వైమానిక దాడిపై విభిన్న ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. తాజాగా అమిత్​షా, యోగి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైమానిక దాడిలో 250 మంది హతమయ్యారని వ్యాఖ్యానించారు భాజపా జాతీయాధ్యక్షుడు.

దీనికి ప్రతిస్పందించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి.... అమిత్​షా వ్యాఖ్యలు నిజమేనా? మోదీ మౌనం వీడాలని ట్వీట్​ చేశారు. మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన చేయకుండా... మౌనంగా ఉండటం వెనుక రహస్యమేమైనా ఉందా? అని ప్రశ్నించారు మాయావతి.

  • BJP chief Amit Shah arduously making claim that IAF strike had killed over 250 terrorists in Pak but why his guru PM Modi who is always keen to take credit for everything is silent over it? Terrorists killed is good news but what is the secret behind deep silence of PM over it?

    — Mayawati (@Mayawati) March 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేంద్ర సహాయమంత్రి వీకే సింగ్​ అమిత్​షా వ్యాఖ్యలపై స్పందించారు. అమిత్​షా చెప్పింది ఒక ఊహాజనిత సంఖ్య మాత్రమేనన్నారు.

''దాడి సమయంలో ఎంతమంది భవనంలో ఉన్నారన్న దానిని ఆధారంగా చేసుకొని అలా చెప్పారు. అది అంచనా మాత్రమే. వారూ స్పష్టమైన సంఖ్య చెప్పలేదు. ఇంతమంది మరణించారని భావించారు. అది ఊహాజనితమే.''

- వీకే సింగ్​, కేంద్ర విదేశీవ్యవహారాల సహాయమంత్రి

మెరుపుదాడిలో ఎంతమంది మరణించారో లెక్కించడం తమ పనికాదని వాయుసేన తేల్చిచెప్పింది. కేంద్రమే అధికారిక ప్రకటన చేస్తుందని స్పష్టంచేసింది.

2016 సెప్టెంబర్​లో జరిపిన తొలి మెరుపుదాడిలో ఎంతమంది ఉగ్రవాదులు మరణించారో ఇప్పటికీ స్పష్టత లేదు. ఇప్పుడు ఫిబ్రవరి 26 దాడుల వంతు. ఈ రాజకీయం ఇంకెలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

భారత వైమానిక దళం పాక్​కు ముచ్చెమటలు పట్టించి వారం దాటింది. అనంతరం ఇరుదేశాల మధ్య పరిస్థితి యుద్ధవాతావరణాన్ని తలపించి ఒక్కసారిగా శాంతించింది.

జాతీయస్థాయిలో మాత్రం ఈ అంశంపై రాజకీయం తీవ్రమవుతోంది. వైమానిక దాడిలో మరణించిన ఉగ్రవాదుల సంఖ్యపై ఎలాంటి స్పష్టత లేదు. 350 అని ఒకరు, 300కు పైగా అని మరొకరు ఇలా ప్రకటనలూ చేసుకుంటూ వస్తున్నారు. జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ వైమానిక దాడి సమయంలో అక్కడ 300 ఫోన్లు క్రియాశీలకంగా ఉన్నాయని తెలిపింది. ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​​ ఒక సభలో ఈ సంఖ్య 400గా పేర్కొన్నారు.

''48 గంటలవ్యవధిలోనే ఉగ్రవాదుల్ని మన భద్రతాసిబ్బంది అంతమొందించారు. ఫిబ్రవరి 14 పుల్వామా దాడికి ప్రతిగా 40 మందికి 400 మందితో బదులు తీర్చుకున్నారు. ''

- యోగి ఆదిత్యనాథ్​, ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి

ఇటీవలే కేంద్రమంత్రి అహ్లువాలియా వైమానిక దాడి మృతుల సంఖ్యను ప్రధాని మోదీ ఎప్పుడూ ధ్రువీకరించలేదన్నారు. ఈ వ్యాఖ్యలు విపక్షాల విమర్శలకు తావిచ్చాయి. అసలెంత మంది చనిపోయారో నిగ్గు తేల్చాల్సిందేనని పట్టుబడుతున్నాయి ప్రతిపక్షాలు.

విపక్షాల దాడి...

మెరుపుదాడులపై వరుసగా కాంగ్రెస్​ సీనియర్​ నేతలు మోదీపై ప్రశ్నల వర్షం కురిపించారు. సాక్ష్యాధారాలతో సహా నిరూపించాల్సిందేనని కపిల్​సిబల్​ ట్వీట్​ చేశారు. అంతర్జాతీయ మీడియా ఆధారాలు లేవంటుంది... దీనికి బదులివ్వండి అని మోదీని కోరారు. కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా... కేంద్రమంత్రి అహ్లువాలియా వ్యాఖ్యలపై స్పష్టతనివ్వాలని మోదీని డిమాండ్​ చేశారు.

ప్రతిపక్షాల ఆరోపణలకు అదే స్థాయిలో దీటుగా బదులిస్తోంది అధికార భాజపా. కాంగ్రెస్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని ఎదురుదాడి చేస్తోంది. ఇది​ జవాన్లను అవమానించడమే అని ఎప్పటికప్పుడు ధ్వజమెత్తుతోంది.

undefined

సొంత పార్టీ నుంచే...

భాజపా సీనియర్​ నాయకులు వివిధ సమావేశాల్లో వైమానిక దాడిపై విభిన్న ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. తాజాగా అమిత్​షా, యోగి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైమానిక దాడిలో 250 మంది హతమయ్యారని వ్యాఖ్యానించారు భాజపా జాతీయాధ్యక్షుడు.

దీనికి ప్రతిస్పందించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి.... అమిత్​షా వ్యాఖ్యలు నిజమేనా? మోదీ మౌనం వీడాలని ట్వీట్​ చేశారు. మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన చేయకుండా... మౌనంగా ఉండటం వెనుక రహస్యమేమైనా ఉందా? అని ప్రశ్నించారు మాయావతి.

  • BJP chief Amit Shah arduously making claim that IAF strike had killed over 250 terrorists in Pak but why his guru PM Modi who is always keen to take credit for everything is silent over it? Terrorists killed is good news but what is the secret behind deep silence of PM over it?

    — Mayawati (@Mayawati) March 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేంద్ర సహాయమంత్రి వీకే సింగ్​ అమిత్​షా వ్యాఖ్యలపై స్పందించారు. అమిత్​షా చెప్పింది ఒక ఊహాజనిత సంఖ్య మాత్రమేనన్నారు.

''దాడి సమయంలో ఎంతమంది భవనంలో ఉన్నారన్న దానిని ఆధారంగా చేసుకొని అలా చెప్పారు. అది అంచనా మాత్రమే. వారూ స్పష్టమైన సంఖ్య చెప్పలేదు. ఇంతమంది మరణించారని భావించారు. అది ఊహాజనితమే.''

- వీకే సింగ్​, కేంద్ర విదేశీవ్యవహారాల సహాయమంత్రి

మెరుపుదాడిలో ఎంతమంది మరణించారో లెక్కించడం తమ పనికాదని వాయుసేన తేల్చిచెప్పింది. కేంద్రమే అధికారిక ప్రకటన చేస్తుందని స్పష్టంచేసింది.

2016 సెప్టెంబర్​లో జరిపిన తొలి మెరుపుదాడిలో ఎంతమంది ఉగ్రవాదులు మరణించారో ఇప్పటికీ స్పష్టత లేదు. ఇప్పుడు ఫిబ్రవరి 26 దాడుల వంతు. ఈ రాజకీయం ఇంకెలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

SHOTLIST:
CLIENTS PLEASE NOTE: THE MUSIC USED OVER THE CATWALK SECTIONS OF THIS STORY IS NOT CLEARED FOR USE - WE ADVISE THAT YOU REPLACE IT WITH YOUR OWN CLEARABLE SELECTION.
RESTRICTION SUMMARY:
AP CLIENTS ONLY
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 5, 2019, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.