మధ్యప్రదేశ్ రత్లాంలో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని బైపాస్ మార్గంలో ఓ యాసిడ్ ట్యాంకర్ లీకేజీకి గురైంది. ఆ ప్రాంతం మొత్తం తెల్లటి పొగతో నిండిపోయింది. దీంతో పరిసర ప్రాంత ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
![Acid tanker leak causes havoc on Ratlam bypass](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mp-rat-01-tankar-acid-risav-pkg-7204864_13082020144117_1308f_01236_747.jpg)
క్లోరోసల్ఫోరిక్ యాసిడ్ నింపుకొని నగ్దా నుంచి గుజరాత్లోని అహ్మదాబాద్ వైపునకు ట్యాంకర్ వెళుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. రత్లాంలోని బైపాస్ రోడ్డులో లీకేజీ కాగా.. భారీగా తెల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. లీకేజీని గుర్తించిన డ్రైవర్ వెంటనే లారీని ప్రధాన రహదారి నుంచి పక్క దారిలోకి తీసుకెళ్లి నిలిపేశాడు.
ఆ తర్వాత అహ్మదాబాద్ డ్రెస్సింగ్ కంపెనీకి చెందిన సిబ్బంది, సంఘటనాస్థలానికి చేరుకుని యాసిడ్ను మరో ట్యాంకర్లోకి మార్చారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవటం వల్ల అంతా ఊపిరిపీల్చుకున్నారు.
![Acid tanker leak causes havoc on Ratlam bypass](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03:48:07:1597313887_mp-rat-01-tankar-acid-risav-pkg-7204864_13082020144112_1308f_01236_1013.jpg)
ఇదీ చూడండి: అన్నీ మరచిపోయి ముందుకు సాగాలి: గహ్లోత్