ETV Bharat / bharat

'ఆత్మనిర్భర భారత్​... 130 కోట్ల మంది సంకల్పం'

author img

By

Published : Aug 15, 2020, 8:20 AM IST

Updated : Aug 15, 2020, 10:42 AM IST

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. భారత్​ స్వావలంబనవైపు పరుగులు తీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తన వద్ద ఉన్న ప్రకృతి వనరులను ఉపయోగించుకుని దేశీయంగా ఉత్పత్తిని పెంపొందించుకోవాలని.. వాటిని అంతర్జాతీయం పంపిణీ చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Aatmanirbhar Bharat has become a 'mantra' for the 130 cr Indians today: PM Modi
'130కోట్ల మంది భారతీయుల మంత్ర ఆత్మ నిర్భర్​ భారత్​'

అపార ప్రకృతి వనరుల ఆసరాతో భారత్​ దేశీయంగా ఉత్పత్తి పెంపొందించుకుని, అంతర్జాతీయ మార్కెట్లకు అందించే స్థాయికి ఎదగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దిల్లీ ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించిన ప్రసంగించిన మోదీ.. భారతదేశం స్వావలంబనవైపు పరుగు పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తుచేశారు. 'ఆత్మనిర్భర్​ భారత్​' ఇప్పుడు 130కోట్ల మంది భారతీయులకు ఓ మంత్రంగా మారిందన్నారు. ఇన్ని రోజులు ఓ కలగానే మిగిలిపోయిన ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ ప్రతిజ్ఞగా మారుతోందని తెలిపారు.

"తన కలను భారత్​ సాకారం చేసుకుంటుందని నాను నమ్మకం ఉంది. భారతీయుల శక్తిసామర్థ్యాలపై నాకు ఎంతో విశ్వాసం ఉంది. ఏదైనా చేయాలని అనుకుంటే.. అది పూర్తయ్యే వరకు భారతీయులు విశ్రాంతి తీసుకోరు."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

గత ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డు స్థాయిలో 18శాతం వృద్ధి చెందాయని తెలిపిన మోదీ... కరోనా సంక్షోభంలోనూ ప్రపంచ దేశాల్లోని పెద్ద కంపెనీలు భారత్​వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో 'వోకల్​ ఫర్​ లోకల్​'ను ప్రస్తావించారు మోదీ. తమ శక్తిని నమ్ముకుని ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మలుచుకోవాలన్నారు. ముడి సరుకును ఎగుమతి చేసి... పూర్తిగా తయారైన వస్తువులను దేశం దిగుమతి చేసుకునే దుస్థితి ఇంకెన్నాళ్లని ప్రశ్నించిన ప్రధాని.. ఆత్మనిర్భర భారత్​ తక్షణావసరమని స్పష్టంచేశారు.

ఆత్మనిర్భర్​ భారత్ సాధన విషయంలో​ లక్షలాది అనుమానాలు, సవాళ్లున్నాయని అంగీకరించారు ప్రధాని. అయితే వాటన్నింటినీ అధిగమించేందుకు కోటికిపైగా పరిష్కారాలను చూపగల శక్తి భారతీయులకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.

కరోనా సంక్షోభ సమయానికి ముందు ఎన్​-95మాస్కులను తయారీ చేసే స్థితిలో భారత్​ లేదని.. కానీ ఇప్పుడు వాటిని ఎగుమతులు కూడా చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:-

అపార ప్రకృతి వనరుల ఆసరాతో భారత్​ దేశీయంగా ఉత్పత్తి పెంపొందించుకుని, అంతర్జాతీయ మార్కెట్లకు అందించే స్థాయికి ఎదగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దిల్లీ ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించిన ప్రసంగించిన మోదీ.. భారతదేశం స్వావలంబనవైపు పరుగు పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తుచేశారు. 'ఆత్మనిర్భర్​ భారత్​' ఇప్పుడు 130కోట్ల మంది భారతీయులకు ఓ మంత్రంగా మారిందన్నారు. ఇన్ని రోజులు ఓ కలగానే మిగిలిపోయిన ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ ప్రతిజ్ఞగా మారుతోందని తెలిపారు.

"తన కలను భారత్​ సాకారం చేసుకుంటుందని నాను నమ్మకం ఉంది. భారతీయుల శక్తిసామర్థ్యాలపై నాకు ఎంతో విశ్వాసం ఉంది. ఏదైనా చేయాలని అనుకుంటే.. అది పూర్తయ్యే వరకు భారతీయులు విశ్రాంతి తీసుకోరు."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

గత ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డు స్థాయిలో 18శాతం వృద్ధి చెందాయని తెలిపిన మోదీ... కరోనా సంక్షోభంలోనూ ప్రపంచ దేశాల్లోని పెద్ద కంపెనీలు భారత్​వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో 'వోకల్​ ఫర్​ లోకల్​'ను ప్రస్తావించారు మోదీ. తమ శక్తిని నమ్ముకుని ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మలుచుకోవాలన్నారు. ముడి సరుకును ఎగుమతి చేసి... పూర్తిగా తయారైన వస్తువులను దేశం దిగుమతి చేసుకునే దుస్థితి ఇంకెన్నాళ్లని ప్రశ్నించిన ప్రధాని.. ఆత్మనిర్భర భారత్​ తక్షణావసరమని స్పష్టంచేశారు.

ఆత్మనిర్భర్​ భారత్ సాధన విషయంలో​ లక్షలాది అనుమానాలు, సవాళ్లున్నాయని అంగీకరించారు ప్రధాని. అయితే వాటన్నింటినీ అధిగమించేందుకు కోటికిపైగా పరిష్కారాలను చూపగల శక్తి భారతీయులకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.

కరోనా సంక్షోభ సమయానికి ముందు ఎన్​-95మాస్కులను తయారీ చేసే స్థితిలో భారత్​ లేదని.. కానీ ఇప్పుడు వాటిని ఎగుమతులు కూడా చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:-

Last Updated : Aug 15, 2020, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.