ETV Bharat / bharat

2024 నాటికి మరో వంద విమానాశ్రయాలు.!

author img

By

Published : Oct 21, 2020, 9:08 PM IST

ఉడాన్​ ప్రాజెక్టులో భాగంగా దేశంలో మరిన్ని విమానాశ్రయాలను నిర్మించాలని కేంద్రం భావిస్తోంది. 2024లోగా దాదాపు 100 ఎయిర్​పోర్టులను అందుబాటులోకి తీసుకురానుంది.

AAI plans to develop 100 airports, waterdromes, heliports under UDAN by 2024
2024 నాటికి వంద విమానాశ్రయాలు.!

విమాన ప్రయాణాలను ప్రజలకు మరింత దగ్గర చేసే దిశగా తీసుకొచ్చిన ఉడాన్​ పథకం కింద 2024 నాటికి 100 విమానాశ్రయాలను నిర్మించాలని కేంద్రం సంకల్పించింది. ఇందులో హెలిపోర్టులు​, వాటర్​డ్రూమ్​లు కూడా ఉండనున్నాయని ఎయిర్​పోర్ట్​ అథారిటీ ఆఫ్​ ఇండియా(ఏఏఐ) తెలిపింది. ఉడాన్​ పథకం తీసుకువచ్చి నేటికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

దేశవ్యాప్తంగా 50 విమానాశ్రయాలను అభివృద్ధి చేసున్నట్లు ఏఏఐ పేర్కొంది. మరో నాలుగేళ్లలో వంద ఎయిర్​పోర్టులను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఉడాన్ నాలుగో వార్షికోత్సవంలో పాల్గొన్న ఏఏఐ ఛైర్మన్​ అరవింద్​ సింగ్​.. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా విమానాశ్రయాల నిర్మాణాలు జరగాలన్నారు.

విమాన ప్రయాణాలను ప్రజలకు మరింత దగ్గర చేసే దిశగా తీసుకొచ్చిన ఉడాన్​ పథకం కింద 2024 నాటికి 100 విమానాశ్రయాలను నిర్మించాలని కేంద్రం సంకల్పించింది. ఇందులో హెలిపోర్టులు​, వాటర్​డ్రూమ్​లు కూడా ఉండనున్నాయని ఎయిర్​పోర్ట్​ అథారిటీ ఆఫ్​ ఇండియా(ఏఏఐ) తెలిపింది. ఉడాన్​ పథకం తీసుకువచ్చి నేటికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

దేశవ్యాప్తంగా 50 విమానాశ్రయాలను అభివృద్ధి చేసున్నట్లు ఏఏఐ పేర్కొంది. మరో నాలుగేళ్లలో వంద ఎయిర్​పోర్టులను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఉడాన్ నాలుగో వార్షికోత్సవంలో పాల్గొన్న ఏఏఐ ఛైర్మన్​ అరవింద్​ సింగ్​.. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా విమానాశ్రయాల నిర్మాణాలు జరగాలన్నారు.

ఇదీ చూడండి: ఐఏఎఫ్​ తొలి మహిళా అధికారి కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.