దేశంలో మొత్తం 25 మందికి కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ సోకినట్లు తేలింది. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఈ విషయం గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
బుధవారం నాటికి 20 కేసులు వెలుగులోకి రాగా.. తాజాగా పుణె ఎన్ఐవీలో నాలుగు, దిల్లీ ఐజీఐబీలో ఒక నమూనా కొత్త స్ట్రెయిన్కు పాజిటివ్గా తేలిందని వెల్లడించింది. బాధితులందరినీ ఐసోలేషన్లో ఉంచినట్లు తెలిపింది.
ఇదీ చదవండి: దేశంలో 20 మందికి కొత్త రకం కరోనా నిర్ధరణ