ETV Bharat / bharat

3 నెలల్లో 950 సార్లు పాక్​ కవ్వింపు చర్యలు

author img

By

Published : Nov 18, 2019, 8:18 PM IST

Updated : Nov 18, 2019, 11:20 PM IST

ఆగస్టు-అక్టోబరు మధ్య నియంత్రణ రేఖ వద్ద పాక్ సైన్యం 950 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ వివరాలు వెల్లడించింది.

3 నెలల్లో 950 సార్లు పాక్​ కవ్వింపు చర్యలు
3 నెలల్లో 950 సార్లు పాక్​ కవ్వింపు చర్యలు

ఆగస్టు-అక్టోబర్​ మధ్య పాకిస్థాన్​ సైన్యం 950 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కేంద్రం వెల్లడించింది. పొరుగు దేశ సైన్యం దాడిలో ముగ్గురు భారతీయ జవాన్లు అమరులైనట్లు తెలిపింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్.

"పాక్​ నియంత్రణరేఖ వద్ద 950సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ము ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద 75 సార్లు కాల్పులు జరిపింది. ఈ మూడు నెలల్లో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. పాకిస్థాన్​ కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడల్లా భారత సైన్యం దీటుగా సమాధానం ఇస్తూనే వస్తుంది. ఈ అంశాన్ని పలుసార్లు పాక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం."

-శ్రీపాద్​ నాయక్​, రక్షణ శాఖ సహాయ మంత్రి

పాక్​ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లను అరికట్టేందుకు సాంకేతికత సాయంతో పటిష్ఠ వ్యూహం అమలు చేస్తున్నట్లు తెలిపారు నాయక్.

ఇదీ చూడండి : ఆర్థిక మాంద్యమా? అదెక్కడ?... విపక్షానికి కేంద్రం ప్రశ్న

3 నెలల్లో 950 సార్లు పాక్​ కవ్వింపు చర్యలు

ఆగస్టు-అక్టోబర్​ మధ్య పాకిస్థాన్​ సైన్యం 950 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కేంద్రం వెల్లడించింది. పొరుగు దేశ సైన్యం దాడిలో ముగ్గురు భారతీయ జవాన్లు అమరులైనట్లు తెలిపింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్.

"పాక్​ నియంత్రణరేఖ వద్ద 950సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ము ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద 75 సార్లు కాల్పులు జరిపింది. ఈ మూడు నెలల్లో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. పాకిస్థాన్​ కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడల్లా భారత సైన్యం దీటుగా సమాధానం ఇస్తూనే వస్తుంది. ఈ అంశాన్ని పలుసార్లు పాక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం."

-శ్రీపాద్​ నాయక్​, రక్షణ శాఖ సహాయ మంత్రి

పాక్​ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లను అరికట్టేందుకు సాంకేతికత సాయంతో పటిష్ఠ వ్యూహం అమలు చేస్తున్నట్లు తెలిపారు నాయక్.

ఇదీ చూడండి : ఆర్థిక మాంద్యమా? అదెక్కడ?... విపక్షానికి కేంద్రం ప్రశ్న

Siliguri (WB), Nov 16 (ANI): Rosogolla Divas was celebrated with great enthusiasm in West Bengal's Siliguri to mark the second anniversary of the state winning the Geographical Indication (GI) tag. West Bengal was in bitter sweet battle with Odisha to get GI tag on the sweet dish. West Bengal won the battle and got the GI tag for Bengal Rosogulla in the year 2017. Taking part in the celebrations, people were seen enjoying rosogulla at different part of the city.
Last Updated : Nov 18, 2019, 11:20 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.