ETV Bharat / bharat

దిల్లీ అల్లర్లలో 24 మంది మృతి- ప్రభుత్వ 'బదిలీల' వ్యూహం

author img

By

Published : Feb 26, 2020, 3:54 PM IST

Updated : Mar 2, 2020, 3:37 PM IST

దిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య 24కి చేరింది. మరోవైపు ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది కేంద్రం.

delhi voilence
దిల్లీ అల్లర్

దిల్లీ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ హింసాత్మక నిరసనల్లో మరణించిన వారి సంఖ్య 24కి చేరినట్లు అధికారులు ప్రకటించారు.

బదిలీలు

నిరసనలను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రోహిణి ప్రాంతం అదనపు కమిషనర్ ఎస్​డీ మిశ్రాను ట్రాఫిక్ విభాగానికి​ బదిలీ చేసింది. రోహిణి డీసీపీగా పి. మిశ్రాను నియమించింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ(ఐజీఐ) డీసీపీ గా ఉన్న ఎస్​ భాటియాను సెంట్రల్ దిల్లీకి బదిలీ చేసింది. సెంట్రల్ దిల్లీ అదనపు కమిషనర్ రాంధవాను క్రైం బ్రాంచ్​కు బదిలీ చేసింది. కమిషనర్ స్టాఫ్​ అధికారి రాజీవ్ రంజన్​ను ఐజీఐ డీసీపీగా నియమించింది.

కొద్ది రోజులుగా దిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు హింసాత్మక నిరసనలు చేపట్టారు.

దిల్లీ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ హింసాత్మక నిరసనల్లో మరణించిన వారి సంఖ్య 24కి చేరినట్లు అధికారులు ప్రకటించారు.

బదిలీలు

నిరసనలను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రోహిణి ప్రాంతం అదనపు కమిషనర్ ఎస్​డీ మిశ్రాను ట్రాఫిక్ విభాగానికి​ బదిలీ చేసింది. రోహిణి డీసీపీగా పి. మిశ్రాను నియమించింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ(ఐజీఐ) డీసీపీ గా ఉన్న ఎస్​ భాటియాను సెంట్రల్ దిల్లీకి బదిలీ చేసింది. సెంట్రల్ దిల్లీ అదనపు కమిషనర్ రాంధవాను క్రైం బ్రాంచ్​కు బదిలీ చేసింది. కమిషనర్ స్టాఫ్​ అధికారి రాజీవ్ రంజన్​ను ఐజీఐ డీసీపీగా నియమించింది.

కొద్ది రోజులుగా దిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు హింసాత్మక నిరసనలు చేపట్టారు.

Last Updated : Mar 2, 2020, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.