ETV Bharat / bharat

మిజోరంలో మళ్లీ భూకంపం- రిక్టర్​ స్కేలుపై 4.1 తీవ్రత

మిజోరంలో మరోసారి భూమి కంపించింది. బుధవారం ఉదయం సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్​ స్కేలుపై 4.1 గా నమోదైంది. అయితే.. వారం రోజుల వ్యవధిలో ఆ రాష్ట్రంలో ఇది నాలుగో భూకంపం.

author img

By

Published : Jun 24, 2020, 12:20 PM IST

4.1 magnitude earthquake strikes Mizoram
మిజోరంలో మళ్లీ భూకంపం- రిక్టర్​ స్కేలుపై 4.1 తీవ్రత

ఈశాన్య రాష్ట్రం మిజోరంలో మరోసారి భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 8:02 గంటల ప్రాంతంలో భూమి కంపించగా.. రిక్టర్​ స్కేలుపై 4.1 గా తీవ్రత నమోదైంది. ఛాంపైకు దక్షిణ, నైరుతి ప్రాంతంలో సుమారు 31 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం(ఎన్​ఎస్​ఐ) తెలిపింది.

అంతకుముందు 3 సార్లు..

అయితే.. ఈ నెల 22న కూడా 12 గంటల వ్యవధిలో రాష్ట్రంలో రెండుసార్లు భూకంపం వచ్చినట్లు ముఖ్యమంత్రి జోరంతుంగా తెలిపారు. అంతకుముందు కూడా జూన్​ 18న రాష్ట్రంలో భూమి కంపించింది.

ఇదీ చదవండి: మిజోరంలో భూకంపం- 12 గంటల్లో రెండోసారి

ఈశాన్య రాష్ట్రం మిజోరంలో మరోసారి భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 8:02 గంటల ప్రాంతంలో భూమి కంపించగా.. రిక్టర్​ స్కేలుపై 4.1 గా తీవ్రత నమోదైంది. ఛాంపైకు దక్షిణ, నైరుతి ప్రాంతంలో సుమారు 31 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం(ఎన్​ఎస్​ఐ) తెలిపింది.

అంతకుముందు 3 సార్లు..

అయితే.. ఈ నెల 22న కూడా 12 గంటల వ్యవధిలో రాష్ట్రంలో రెండుసార్లు భూకంపం వచ్చినట్లు ముఖ్యమంత్రి జోరంతుంగా తెలిపారు. అంతకుముందు కూడా జూన్​ 18న రాష్ట్రంలో భూమి కంపించింది.

ఇదీ చదవండి: మిజోరంలో భూకంపం- 12 గంటల్లో రెండోసారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.