ETV Bharat / bharat

మహారాష్ట్రలో 24 గంటల్లో 368 కేసులు నమోదు

author img

By

Published : Apr 18, 2020, 8:40 PM IST

దేశంలో కరోనా కేసులు, మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో 368 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం 3600 మందికి పైగా వైరస్​ సోకింది. దిల్లీ, రాజస్థాన్​, తమిళనాడు, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల్లో మహమ్మారి ప్రభావం మరింత తీవ్రంగా ఉంది.

328 new COVID19 cases have been recorded today in Maharashtra
మహారాష్ట్రలో 24 గంటల్లో 368 కేసులు నమోదు

దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అత్యధిక కేసులు కలిగిన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలవగా, తర్వాతి స్థానంలో దిల్లీ నిలిచింది.

మహారాష్ట్రలో..

దేశంలో కరోనా కేంద్ర బిందువుగా మారింది మహారాష్ట్ర. పుణెకు చెందిన ఓ పోలీస్​ కానిస్టేబుల్​, అతని భార్యకు వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. అంతేకాకుండా ఓ సీనియర్ డాక్టర్​ కూడా మహమ్మారి బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 368 కొత్త కేసులు నమోదవగా.. ఒక్క ముంబయిలోనే 184 కొవిడ్​-19 కేసులను గుర్తించారు అధికారులు. వీటితో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 3,648 మందికి వైరస్​ సోకింది. మొత్తం 201 మంది మృతి చెందగా, 331 మంది కోలుకున్నారు.

దిల్లీలో..

దిల్లీలో తాజాగా మరో 67 మంది సోకినట్లు తెలిపారు. దీంతో వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 1707కు చేరింది. అయితే గత మూడు రోజుల నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ వెల్లడించారు.

తమిళనాడులో..

తమిళనాడులో ఇవాళ మరో 49 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 1,372కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మృతి చెందారు.

గుజరాత్​లో..

గుజరాత్​లో ఇవాళ ఒక్కరోజే ఏడుగురు మృతి చెందగా, మొత్తం 48 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. అంతేకాకుండా మరో 176 మందికి వైరస్​ సోకింది. ఇప్పటివరకు మొత్తం 1376 మంది మహమ్మారి బారిన పడ్డారు.

ఉత్తరప్రదేశ్​లో..

కరోనా లక్షణాలతో 20 ఏళ్ల యువకుడు మరణించినట్లు అధికారులు తెలిపారు. సదరు వ్యక్తి గత రెండు రోజుల నుంచి నిర్బంధ కేంద్రంలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. తాజాగా మరో 20 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 969కి చేరింది.

కర్ణాటకలో..

కర్ణాటకలో తాజాగా మరో 12 మందికి వైరస్​ సోకినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. ఫలితంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 371కి చేరింది. మొత్తం 92 మంది మహమ్మారి నుంచి కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇతర రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే..

జమ్ముకశ్మీర్​లో తాజాగా మరో 14 కేసులు నమోదవగా... మొత్తం కేసుల సంఖ్య 341కి చేరింది. ఉత్తరాఖండ్​లో తాజాగా మరో 3 కేసులు బయటపడినందున.. మొత్తం కేసులు సంఖ్య 42కు చేరింది. హిమాచల్​ ప్రదేశ్​ లో మొత్తం 40 మందికి వైరస్​ సోకింది. కేరళలో మొత్తం కేసులు 396 కాగా.. ముగ్గురు మృతి చెందారు.

షా సమీక్ష..

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ పొడిగించిన నేపథ్యంలో తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్​షా. ఈ నేపథ్యంలో నిత్యావసరాల రవాణాపైనా చర్చ జరిపారు.

దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అత్యధిక కేసులు కలిగిన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలవగా, తర్వాతి స్థానంలో దిల్లీ నిలిచింది.

మహారాష్ట్రలో..

దేశంలో కరోనా కేంద్ర బిందువుగా మారింది మహారాష్ట్ర. పుణెకు చెందిన ఓ పోలీస్​ కానిస్టేబుల్​, అతని భార్యకు వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. అంతేకాకుండా ఓ సీనియర్ డాక్టర్​ కూడా మహమ్మారి బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 368 కొత్త కేసులు నమోదవగా.. ఒక్క ముంబయిలోనే 184 కొవిడ్​-19 కేసులను గుర్తించారు అధికారులు. వీటితో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 3,648 మందికి వైరస్​ సోకింది. మొత్తం 201 మంది మృతి చెందగా, 331 మంది కోలుకున్నారు.

దిల్లీలో..

దిల్లీలో తాజాగా మరో 67 మంది సోకినట్లు తెలిపారు. దీంతో వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 1707కు చేరింది. అయితే గత మూడు రోజుల నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ వెల్లడించారు.

తమిళనాడులో..

తమిళనాడులో ఇవాళ మరో 49 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 1,372కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మృతి చెందారు.

గుజరాత్​లో..

గుజరాత్​లో ఇవాళ ఒక్కరోజే ఏడుగురు మృతి చెందగా, మొత్తం 48 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. అంతేకాకుండా మరో 176 మందికి వైరస్​ సోకింది. ఇప్పటివరకు మొత్తం 1376 మంది మహమ్మారి బారిన పడ్డారు.

ఉత్తరప్రదేశ్​లో..

కరోనా లక్షణాలతో 20 ఏళ్ల యువకుడు మరణించినట్లు అధికారులు తెలిపారు. సదరు వ్యక్తి గత రెండు రోజుల నుంచి నిర్బంధ కేంద్రంలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. తాజాగా మరో 20 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 969కి చేరింది.

కర్ణాటకలో..

కర్ణాటకలో తాజాగా మరో 12 మందికి వైరస్​ సోకినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. ఫలితంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 371కి చేరింది. మొత్తం 92 మంది మహమ్మారి నుంచి కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇతర రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే..

జమ్ముకశ్మీర్​లో తాజాగా మరో 14 కేసులు నమోదవగా... మొత్తం కేసుల సంఖ్య 341కి చేరింది. ఉత్తరాఖండ్​లో తాజాగా మరో 3 కేసులు బయటపడినందున.. మొత్తం కేసులు సంఖ్య 42కు చేరింది. హిమాచల్​ ప్రదేశ్​ లో మొత్తం 40 మందికి వైరస్​ సోకింది. కేరళలో మొత్తం కేసులు 396 కాగా.. ముగ్గురు మృతి చెందారు.

షా సమీక్ష..

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ పొడిగించిన నేపథ్యంలో తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్​షా. ఈ నేపథ్యంలో నిత్యావసరాల రవాణాపైనా చర్చ జరిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.