ETV Bharat / bharat

మహారాష్ట్రలో 10 వేలకు చేరువలో కరోనా కేసులు

author img

By

Published : Apr 29, 2020, 11:12 PM IST

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తూనే ఉంది. మహారాష్ట్రలో ఇవాళ ఒక్కరోజే 597 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలినట్లు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,915కు చేరింది. గుజరాత్​లో 24 గంటల వ్యవధిలో 308 మందికి వైరస్ సోకింది.

173 new COVID-19 cases in MP, ten deaths
మహారాష్ట్రలో 10 వేలకు చేరువలో కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. అత్యధిక కేసులు నమోదయిన నేపథ్యంలో వైరస్ కేసుల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో గుజరాత్, దిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు నిలిచాయి.

'మహా'లో 10 వేలకు చేరువలో..

మహారాష్ట్రలో రోజూ వందల సంఖ్యలో పాజిటివ్​ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 597 మందికి వైరస్​ సోకింది. రాష్ట్రంలో 9,915 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు వెల్లడించారు. కొత్తగా మరో 32 మంది మరణించగా.. మొత్తంగా మృతుల సంఖ్య 432కు చేరింది.

గుజరాత్​లో 4 వేలకు పైగా..

గుజరాత్​లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇవాళ మరో 308 మందికి వైరస్ పాజిటివ్​గా​ నిర్ధరణ అయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 4,082 చేరినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 197 మంది వైరస్​కు బలయ్యారు. 527 మంది ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారని​ సమాచారం.

మధ్యప్రదేశ్​లో మరో 173 కేసులు...

మధ్యప్రదేశ్​లో కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగింది. నేడు కొత్తగా 173 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా 2,560 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 10 మంది మృతి చెందగా.. మరణాల సంఖ్య 130కి పెరిగింది. 461 మందిలో వైరస్ నయమైంది.

తమిళనాడులో 100 పైగా నూతన కేసులు..

తమిళనాడులో గత 24 గంటల్లో 104 మందికి వైరస్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో వైరస్ బాధితుల సంఖ్య 2,162 చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 1,168 మంది కోలుకున్నట్లు చెప్పారు. మొత్తంగా 27 మంది మహమ్మారికి బలయ్యారు.

ఉత్తరప్రదేశ్​లో...

ఉత్తరప్రదేశ్​లో వైరస్ కారణంగా నేడు ఐదుగురు మృతి చెందగా, మరో 81 మంది మహమ్మారి బారినపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,134 మందికి వైరస్​ సోకినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. మొత్తం 477 మంది డిశ్ఛార్జి అయ్యారు.

బంగాల్​లో..

బంగాల్​లో నూతనంగా నమోదైన 33 కేసులతో కలిపి 725 మందికి వైరస్ సోకింది. ఇందులో 119 మంది డిశ్ఛార్జి​ అయ్యారు. మరో 22 మంది మృతి చెందారు.

పంజాబ్​లో మొత్తం 375 మందికి వైరస్​..

పంజాబ్​​లో నేడు మరో 33 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 375 మంది ప్రాణాంతక వైరస్​ బారిన పడినట్లు రాష్ట్ర అధికారులు ప్రకటించారు. కొత్తగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 104 మందికి వైరస్​ నయమైంది.

కర్ణాటకలో 21 మంది మృతి..

కర్ణాటకలోని ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం తాజాగా మరో 12 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం 532 మందికి వైరస్​ సోకినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 21 మృతి చెందగా, 215 మంది ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.

ఒడిశాలో తాజాగా 7 కేసులు

ఒడిశాలో తాజాగా 7 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో 125 మందికి వైరస్​ బారిన పడినట్లు తెలిపింది. మహమ్మారి బారిన పడి 38 మంది కోలుకోగా.. ఒకరు మృతి చెందారు.

రాష్ట్రాల వారీగా..

ఉత్తరాఖండ్​లో ఇప్పటి వరకు 54 మందికి వైరస్​ బారిన పడగా 34 మంది కోలుకున్నారు. జమ్ముకశ్మీర్​లో 565 మందికి వైరస్​ సోకింది. అలాగే బిహార్​ 383 మంది బాధితులు ఉన్నారు.

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. అత్యధిక కేసులు నమోదయిన నేపథ్యంలో వైరస్ కేసుల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో గుజరాత్, దిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు నిలిచాయి.

'మహా'లో 10 వేలకు చేరువలో..

మహారాష్ట్రలో రోజూ వందల సంఖ్యలో పాజిటివ్​ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 597 మందికి వైరస్​ సోకింది. రాష్ట్రంలో 9,915 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు వెల్లడించారు. కొత్తగా మరో 32 మంది మరణించగా.. మొత్తంగా మృతుల సంఖ్య 432కు చేరింది.

గుజరాత్​లో 4 వేలకు పైగా..

గుజరాత్​లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇవాళ మరో 308 మందికి వైరస్ పాజిటివ్​గా​ నిర్ధరణ అయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 4,082 చేరినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 197 మంది వైరస్​కు బలయ్యారు. 527 మంది ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారని​ సమాచారం.

మధ్యప్రదేశ్​లో మరో 173 కేసులు...

మధ్యప్రదేశ్​లో కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగింది. నేడు కొత్తగా 173 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా 2,560 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 10 మంది మృతి చెందగా.. మరణాల సంఖ్య 130కి పెరిగింది. 461 మందిలో వైరస్ నయమైంది.

తమిళనాడులో 100 పైగా నూతన కేసులు..

తమిళనాడులో గత 24 గంటల్లో 104 మందికి వైరస్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో వైరస్ బాధితుల సంఖ్య 2,162 చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 1,168 మంది కోలుకున్నట్లు చెప్పారు. మొత్తంగా 27 మంది మహమ్మారికి బలయ్యారు.

ఉత్తరప్రదేశ్​లో...

ఉత్తరప్రదేశ్​లో వైరస్ కారణంగా నేడు ఐదుగురు మృతి చెందగా, మరో 81 మంది మహమ్మారి బారినపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,134 మందికి వైరస్​ సోకినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. మొత్తం 477 మంది డిశ్ఛార్జి అయ్యారు.

బంగాల్​లో..

బంగాల్​లో నూతనంగా నమోదైన 33 కేసులతో కలిపి 725 మందికి వైరస్ సోకింది. ఇందులో 119 మంది డిశ్ఛార్జి​ అయ్యారు. మరో 22 మంది మృతి చెందారు.

పంజాబ్​లో మొత్తం 375 మందికి వైరస్​..

పంజాబ్​​లో నేడు మరో 33 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 375 మంది ప్రాణాంతక వైరస్​ బారిన పడినట్లు రాష్ట్ర అధికారులు ప్రకటించారు. కొత్తగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 104 మందికి వైరస్​ నయమైంది.

కర్ణాటకలో 21 మంది మృతి..

కర్ణాటకలోని ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం తాజాగా మరో 12 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం 532 మందికి వైరస్​ సోకినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 21 మృతి చెందగా, 215 మంది ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.

ఒడిశాలో తాజాగా 7 కేసులు

ఒడిశాలో తాజాగా 7 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో 125 మందికి వైరస్​ బారిన పడినట్లు తెలిపింది. మహమ్మారి బారిన పడి 38 మంది కోలుకోగా.. ఒకరు మృతి చెందారు.

రాష్ట్రాల వారీగా..

ఉత్తరాఖండ్​లో ఇప్పటి వరకు 54 మందికి వైరస్​ బారిన పడగా 34 మంది కోలుకున్నారు. జమ్ముకశ్మీర్​లో 565 మందికి వైరస్​ సోకింది. అలాగే బిహార్​ 383 మంది బాధితులు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.