ETV Bharat / bharat

బిహార్​లో పిడుగుపాటుకు 13 మంది మృతి

author img

By

Published : Jul 4, 2020, 4:21 PM IST

Updated : Jul 4, 2020, 5:06 PM IST

lightening in bihar
పిడుగు పాటుకు 13 మంది బలి!

16:58 July 04

పిడుగుపాటుకు 13 మంది బలి...

బిహార్​లో వరుస పిడుగు పాట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 13 మంది పిడుగుపాటుకు బలయ్యారు.  

పిడుగుపాటు కారణంగా పట్నా, భోజ్‌పుర్‌, బక్సర్‌, కైమూర్‌, సారణ్​, జహానాబాద్​ జిల్లాల్లో 13 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. 

బాధితుల కుటుంబాలకు  రూ.4 లక్షలు పరిహారం ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​. వాతావరణంలో  తీవ్ర మార్పులు సంభవిస్తున్న తరుణంలో విపత్తు నిర్వహణ విభాగం జారీ చేసిన సూచనలను ప్రజలు పాటించాలని ఆయన కోరారు.

ఇదివరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పిడుగులు పడి 26 మంది మరణించారు. రాబోయే 2-3 గంటల్లో బిహార్​లోని 15 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.

16:19 July 04

బిహార్​లో పిడుగుపాటుకు 13మంది మృతి

బిహార్‌లో పలుచోట్ల పిడుగులు పడి 13 మంది మృత్యువాత పడ్డారు.

16:58 July 04

పిడుగుపాటుకు 13 మంది బలి...

బిహార్​లో వరుస పిడుగు పాట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 13 మంది పిడుగుపాటుకు బలయ్యారు.  

పిడుగుపాటు కారణంగా పట్నా, భోజ్‌పుర్‌, బక్సర్‌, కైమూర్‌, సారణ్​, జహానాబాద్​ జిల్లాల్లో 13 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. 

బాధితుల కుటుంబాలకు  రూ.4 లక్షలు పరిహారం ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​. వాతావరణంలో  తీవ్ర మార్పులు సంభవిస్తున్న తరుణంలో విపత్తు నిర్వహణ విభాగం జారీ చేసిన సూచనలను ప్రజలు పాటించాలని ఆయన కోరారు.

ఇదివరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పిడుగులు పడి 26 మంది మరణించారు. రాబోయే 2-3 గంటల్లో బిహార్​లోని 15 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.

16:19 July 04

బిహార్​లో పిడుగుపాటుకు 13మంది మృతి

బిహార్‌లో పలుచోట్ల పిడుగులు పడి 13 మంది మృత్యువాత పడ్డారు.

Last Updated : Jul 4, 2020, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.