ఉత్తర్ప్రదేశ్ ఫిరోజాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12మంది మృతి చెందారు. 8మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ హైవేపై దిల్లీ నుంచి మోతీహరి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ముందు వెళ్తున్న ట్రక్కును వెనక నుంచి ఢీ కొట్టిందని సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఇటావా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయ చర్యలకు అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.