జమ్ముకశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దును దాటేందుకు యత్నించిన పాకిస్థానీ ఉగ్రముఠాను సమర్థంగా అడ్డుకున్నాయి భద్రతా బలగాలు. ఈ ఘటనలో ఓ ముష్కరుడు హతమయ్యాడు.
రాజౌరీ జిల్లాలోని ఖేరీ సెక్టార్ వద్ద 400 మీటర్ల మేర భారత భూభాగంలోకి ఉగ్రమూకలు చొచ్చుకొచ్చాయి. అయితే వారిని అడ్డుకునేందుకు భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. అతడి వద్ద నుంచి ఓ ఏకే 47 రైఫిల్, రెండు మ్యాగ్జిన్లు స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపడుతోంది సైన్యం.
ఇదీ చూడండి: డ్రాగన్తో ఢీ అంటే 'టీ'.. యుద్ధ ట్యాంకర్లు మోహరించిన భారత్