ETV Bharat / bharat

రెండు గంటల్లోనే లక్షన్నర టికెట్లు ఉఫ్!

జూన్​ 1న ప్రారంభం కానున్న రైళ్లకు డిమాండ్ పెరిగింది. కేవలం 2 గంటల్లోనే దాదాపు లక్షన్నర టికెట్లు బుక్ అయ్యాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ తరగతులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరిన్ని రైళ్లు నడిపే అంశంపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.

author img

By

Published : May 21, 2020, 2:09 PM IST

railway
రైల్వే

లాక్​డౌన్ తర్వాత జూన్​ 1న తొలిసారి ప్రారంభం కాబోయే ప్యాసింజర్​ రైళ్లకు విశేష స్పందన లభిస్తోంది. 100 ప్యాంసింజర్ రైళ్లకు అనుమతించిన రైల్వే .. వీటి బుకింగ్​లు ప్రారంభించింది.

అయితే రెండు గంటల్లోనే దాదాపు 1.50 లక్షల టికెట్లు బుకింగ్ అయినట్లు అధికారులు తెలిపారు.

"12 గంటల సమయంలో 73 రైళ్లకు సంబంధించిన బుకింగ్​లు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 2,90,510 మంది ప్యాసింజర్లతో, 1,49,025 టికెట్లు బుకింగ్ అయ్యాయి."

-రైల్వే ప్రతినిధి

అంతకుముందు, 1.7 లక్షల సాధారణ సేవా కేంద్రాల్లో టికెట్ బుకింగ్ సర్వీసులు ప్రారంభమవుతాయని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రానున్న రెండు మూడు రోజుల్లో అనుమతించిన స్టేషన్​ కౌంటర్లలో బుకింగ్ ప్రారంభం కానున్నట్లు చెప్పారు. మరిన్ని రైళ్లు నడిపే అంశంపై త్వరలోనే ప్రకటన జారీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

అన్ని రైళ్లలో ఏసీ కోచ్​లు

బుకింగ్​లు ప్రారంభమైన రైళ్లలో ఏసీ, నాన్-ఏసీ తరగతులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి అన్ని ప్రత్యేక రైళ్లలో ఈ తరగతులు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

సాధారణ రైళ్ల మాదిరిగానే ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వేశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రాల రాజధానులు సహా రెండు పెద్ద నగరాలను కలుపుతూ ఇవి ప్రయాణిస్తాయని తెలిపింది.

ఇదీ చదవండి: భారత్​లో 5 కోట్ల మందికి ​కరోనా ముప్పు!

లాక్​డౌన్ తర్వాత జూన్​ 1న తొలిసారి ప్రారంభం కాబోయే ప్యాసింజర్​ రైళ్లకు విశేష స్పందన లభిస్తోంది. 100 ప్యాంసింజర్ రైళ్లకు అనుమతించిన రైల్వే .. వీటి బుకింగ్​లు ప్రారంభించింది.

అయితే రెండు గంటల్లోనే దాదాపు 1.50 లక్షల టికెట్లు బుకింగ్ అయినట్లు అధికారులు తెలిపారు.

"12 గంటల సమయంలో 73 రైళ్లకు సంబంధించిన బుకింగ్​లు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 2,90,510 మంది ప్యాసింజర్లతో, 1,49,025 టికెట్లు బుకింగ్ అయ్యాయి."

-రైల్వే ప్రతినిధి

అంతకుముందు, 1.7 లక్షల సాధారణ సేవా కేంద్రాల్లో టికెట్ బుకింగ్ సర్వీసులు ప్రారంభమవుతాయని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రానున్న రెండు మూడు రోజుల్లో అనుమతించిన స్టేషన్​ కౌంటర్లలో బుకింగ్ ప్రారంభం కానున్నట్లు చెప్పారు. మరిన్ని రైళ్లు నడిపే అంశంపై త్వరలోనే ప్రకటన జారీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

అన్ని రైళ్లలో ఏసీ కోచ్​లు

బుకింగ్​లు ప్రారంభమైన రైళ్లలో ఏసీ, నాన్-ఏసీ తరగతులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి అన్ని ప్రత్యేక రైళ్లలో ఈ తరగతులు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

సాధారణ రైళ్ల మాదిరిగానే ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వేశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రాల రాజధానులు సహా రెండు పెద్ద నగరాలను కలుపుతూ ఇవి ప్రయాణిస్తాయని తెలిపింది.

ఇదీ చదవండి: భారత్​లో 5 కోట్ల మందికి ​కరోనా ముప్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.