కేరళలోని కొచ్చిలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువనంతపురం నుంచి కొజికోడ్ వైపు వెళ్తున్న కేరళ ఆర్టీసీ బస్సు చకరపరంబు వద్ద అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 25 మందికి గాయాలయ్యాయి.
ప్రమాదంలో గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు స్థానిక అధికారులు. ఈ ప్రమాదంతో బస్సు తీవ్రంగా ధ్వంసమైంది.

ఇదీ చూడండి:ఉత్తర్ప్రదేశ్లో జర్నలిస్ట్ సజీవదహనం