ETV Bharat / bharat

'ఫేస్​బుక్​ ప్రచారంలో బంగాల్​ టాప్' - ''ఫేస్​బుక్'​ ప్రచారంలో బంగాల్​ టాప్!'

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఈ ఏడాది ఫేస్​బుక్​ ద్వారా ప్రకటనలకు అధికంగా ఖర్చు చేసిన రాష్ట్రంగా బంగాల్​ నిలిచింది. ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు.. ఫేస్​బుక్​లో ప్రకటనల కోసం రూ.3.74 కోట్లు ఖర్చు చేశాయి.

Bengal tops in Facebook political ad spend among poll-bound states
''ఫేస్​బుక్'​ ప్రచారంలో బంగాల్​ టాప్!'
author img

By

Published : Mar 25, 2021, 5:23 PM IST

Updated : Mar 25, 2021, 5:50 PM IST

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఫేస్​బుక్​లో ప్రకటనలకు అధిక మొత్తం వెచ్చించిన రాష్ట్రంగా బంగాల్​ పేరు సంపాదించింది. ఆ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి రూ.3.74 కోట్లు ఖర్చు చేశాయి.

బంగాల్​ తర్వాతి స్థానాల్లోని రాష్ట్రాలు

  • తమిళనాడు (రూ.3.3 కోట్లు)
  • అసోం (రూ.61.77 లక్షలు)
  • కేరళ (రూ.38.86 లక్షలు)
  • పుదుచ్చేరి (రూ.3.34 లక్షలు)

బంగాల్​లో టీఎంసీ ఖర్చులు ఇలా..

  • ఫేస్​బుక్​ ప్రకటనల కోసం బంగాల్​లో అన్ని పార్టీల కంటే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్​ కాంగ్రెస్(టీఎంసీ)​ అధికంగా ఖర్చు చేసింది. దాదాపు రూ.1.69 కోట్లను ఆ పార్టీ వెచ్చించింది.
  • ఫేస్​బుక్​లో 'బంగ్లార్​ గోర్బో మమతా'(బంగాల్​కు మమత గర్వకారణం), 'దమ్​-దమ్​-ఏర్-గార్బో' పేరుతో టీఎంసీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది.
  • టీఎంసీ డిజిటల్​ ప్రకటనలను ఇండియన్​ పొలిటికల్​ యాక్షన్​ కమిటీ(ఐపీఏసీ) నిర్వహిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఆ పార్టీకి సంబంధించి ప్రచార బాధ్యతలను కూడా ఐపీఏసీనే చూసుకుంటోంది.
  • ఖోటికారోక్​ మోదీ(హానికారక మోదీ) ఫేస్​బుక్​ పేజీ కోసం రూ.33.12 లక్షలు ఖర్చు చేసింది టీఎంసీ.

బంగాల్​లో భాజపా ఖర్చులు..

  • ఫేస్​బుక్​లో ప్రకటనల కోసం బంగాల్​లోని భాజపా శాఖ రూ.25.31 లక్షలను ఖర్చు చేసింది. 'అమర్​ పరివార్​ భాజపా పరివార్'​, 'ఆర్​ నోయ్​ అన్నాయ్​' వంటి ఫేస్​బుక్​ పేజీలతో ప్రచారాన్ని నిర్వహిస్తోంది.
  • టీఎంసీ ఫేస్​బుక్​ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. బంగాల్​ భాజపాకు 1.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

మరోవైపు బంగాల్​లో ఫేస్​బుక్​ ప్రకటనల కోసం కాంగ్రెస్​ రూ.5 లక్షలు ఖర్చు చేసింది.

మార్చి 27 నుంచి వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

ఇదీ చూడండి:3000 అడుగుల 'మోదీ ముగ్గు'తో ప్రపంచ రికార్డ్

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఫేస్​బుక్​లో ప్రకటనలకు అధిక మొత్తం వెచ్చించిన రాష్ట్రంగా బంగాల్​ పేరు సంపాదించింది. ఆ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి రూ.3.74 కోట్లు ఖర్చు చేశాయి.

బంగాల్​ తర్వాతి స్థానాల్లోని రాష్ట్రాలు

  • తమిళనాడు (రూ.3.3 కోట్లు)
  • అసోం (రూ.61.77 లక్షలు)
  • కేరళ (రూ.38.86 లక్షలు)
  • పుదుచ్చేరి (రూ.3.34 లక్షలు)

బంగాల్​లో టీఎంసీ ఖర్చులు ఇలా..

  • ఫేస్​బుక్​ ప్రకటనల కోసం బంగాల్​లో అన్ని పార్టీల కంటే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్​ కాంగ్రెస్(టీఎంసీ)​ అధికంగా ఖర్చు చేసింది. దాదాపు రూ.1.69 కోట్లను ఆ పార్టీ వెచ్చించింది.
  • ఫేస్​బుక్​లో 'బంగ్లార్​ గోర్బో మమతా'(బంగాల్​కు మమత గర్వకారణం), 'దమ్​-దమ్​-ఏర్-గార్బో' పేరుతో టీఎంసీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది.
  • టీఎంసీ డిజిటల్​ ప్రకటనలను ఇండియన్​ పొలిటికల్​ యాక్షన్​ కమిటీ(ఐపీఏసీ) నిర్వహిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఆ పార్టీకి సంబంధించి ప్రచార బాధ్యతలను కూడా ఐపీఏసీనే చూసుకుంటోంది.
  • ఖోటికారోక్​ మోదీ(హానికారక మోదీ) ఫేస్​బుక్​ పేజీ కోసం రూ.33.12 లక్షలు ఖర్చు చేసింది టీఎంసీ.

బంగాల్​లో భాజపా ఖర్చులు..

  • ఫేస్​బుక్​లో ప్రకటనల కోసం బంగాల్​లోని భాజపా శాఖ రూ.25.31 లక్షలను ఖర్చు చేసింది. 'అమర్​ పరివార్​ భాజపా పరివార్'​, 'ఆర్​ నోయ్​ అన్నాయ్​' వంటి ఫేస్​బుక్​ పేజీలతో ప్రచారాన్ని నిర్వహిస్తోంది.
  • టీఎంసీ ఫేస్​బుక్​ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. బంగాల్​ భాజపాకు 1.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

మరోవైపు బంగాల్​లో ఫేస్​బుక్​ ప్రకటనల కోసం కాంగ్రెస్​ రూ.5 లక్షలు ఖర్చు చేసింది.

మార్చి 27 నుంచి వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

ఇదీ చూడండి:3000 అడుగుల 'మోదీ ముగ్గు'తో ప్రపంచ రికార్డ్

Last Updated : Mar 25, 2021, 5:50 PM IST

For All Latest Updates

TAGGED:

facebook ads
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.