ETV Bharat / bharat

బంగాల్​లో ప్రచార పంథా మార్చిన భాజపా!

author img

By

Published : Apr 20, 2021, 9:22 AM IST

కొవిడ్​ ఉద్ధృతి దృష్ట్యా బంగాల్​లో ఈ నెల 23న జరిగే ప్రధాన మంత్రి.. ఎన్నికల ప్రచార సభలకు 500 మంది మాత్రమే హాజరయ్యేలా భాజపా చర్యలు తీసుకుంటోంది. ప్రధాని ప్రసంగాన్ని అందరూ వినేందుకు నియోజకవర్గాల్లో ఎల్​ఈడీ తెరలను ఏర్పాట్లు చేస్తోంది.

modi
బంగాల్​లో ప్రచార పంథా మార్చిన భాజపా!

కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో బంగాల్​లో​ భాజపా తన ప్రచార పంథాను మార్చుకుంది. ఏప్రిల్​ 23న జరిగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. బహిరంగ సభలకు 500 మంది మాత్రమే హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. వారంతా కొవిడ్​ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది.

"కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ 500 మంది మాత్రమే ప్రధాని సభకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ర్యాలీలో పాల్గొనే వారంతా మాస్కులు ధరించేలా, శానిటైజర్​ వాడేలా ఏర్పాట్లు చేస్తున్నాం. భౌతిక దూరం పాటించేలా సభలో కుర్చీలను ఉంచుతాం."

-కైలాశ్​ విజయవర్గీయ, బంగాల్​ భాజపా ఇన్​ఛార్జ్​,

ఏప్రిల్​ 23న ముర్షిదాబాద్​, దక్షిణ కోల్​కతా, సియూరీ, మాల్దా ప్రాంతాల్లో మోదీ.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ సీనియర్​ నేత ఒకరు తెలిపారు. ప్రధాని ప్రసంగాన్ని అందరూ వినేలా ఆయా నియోజకవర్గాల వారీగా ఎల్​ఈడీ తెరలను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: బంగాల్​ ఆరో విడత ఎన్నికల ప్రచారానికి తెర

ఇదీ చూడండి: 'చేతులు జోడించి అడుగుతున్నా.. పోలింగ్​ కుదించండి'

కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో బంగాల్​లో​ భాజపా తన ప్రచార పంథాను మార్చుకుంది. ఏప్రిల్​ 23న జరిగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. బహిరంగ సభలకు 500 మంది మాత్రమే హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. వారంతా కొవిడ్​ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది.

"కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ 500 మంది మాత్రమే ప్రధాని సభకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ర్యాలీలో పాల్గొనే వారంతా మాస్కులు ధరించేలా, శానిటైజర్​ వాడేలా ఏర్పాట్లు చేస్తున్నాం. భౌతిక దూరం పాటించేలా సభలో కుర్చీలను ఉంచుతాం."

-కైలాశ్​ విజయవర్గీయ, బంగాల్​ భాజపా ఇన్​ఛార్జ్​,

ఏప్రిల్​ 23న ముర్షిదాబాద్​, దక్షిణ కోల్​కతా, సియూరీ, మాల్దా ప్రాంతాల్లో మోదీ.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ సీనియర్​ నేత ఒకరు తెలిపారు. ప్రధాని ప్రసంగాన్ని అందరూ వినేలా ఆయా నియోజకవర్గాల వారీగా ఎల్​ఈడీ తెరలను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: బంగాల్​ ఆరో విడత ఎన్నికల ప్రచారానికి తెర

ఇదీ చూడండి: 'చేతులు జోడించి అడుగుతున్నా.. పోలింగ్​ కుదించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.