ETV Bharat / bharat

'రాహుల్​ మానసిక స్థితి సరిగా లేదేమో!'

author img

By

Published : Feb 12, 2021, 4:19 PM IST

పార్లమెంటులో బలగాల ఉపసంహరణ గురించి రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ చేసిన ప్రకటనపై కాంగ్రెస్​, భాజపా మధ్య మాటల పోరు మొదలైంది. భారత భూగాన్ని చైనాకు ప్రధాని మోదీ అప్పగించారని రాహుల్​ గాంధీ చేసిన విమర్శలపై భాజపా దీటుగా స్పందించింది. రాహుల్​ వ్యాఖ్యలు చూస్తోంటే ఆయన మానసిక స్థితిలో సమస్యలు ఉన్నాయేమోనని వ్యాఖ్యానించింది.

congress vs bjp
'రాహుల్​ మానసిక స్థితి సరిగా లేదేమో!'

భారత్-చైనా సరిహద్దు ప్రతిష్టంభనపై అధికార ​భాజపా, విపక్ష కాంగ్రెస్​​ మధ్య మాటల పోరు తీవ్రమవుతోంది. భారత భూగాన్ని చైనాకు మోదీ అప్పంగించారని రాహుల్​ చేసిన వ్యాఖ్యలపై భాజపా కౌంటర్​ ఇచ్చింది. రాహుల్​ భారత భద్రతా బలగాల త్యాగాలను అప్రతిష్ఠపాలు చేసేలా మాట్లాడుతున్నారని విమర్శించింది. 43,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు కాంగ్రెస్​ అప్పగించిన ఘటనను భారతీయులు ఎన్నటికీ మర్చిపోరని పేర్కొంది.

"నైతిక మనస్సాక్షి లేని వ్యక్తులు.. అబద్ధాలను ఆశ్రయిస్తారు. రాహుల్​ ఎడమ, కుడి, మధ్యస్థ అబద్ధాలు ఆడుతున్నారు. బహుశా ప్రధాని పదవినీ చేపట్టలేకపోయానన్న ఆవేదనలో ఆయన​ ఉండి ఉంటారు. తన నీడ కూడా తనను నమ్మదని ఆయనకూ తెలుసు. ప్రధాని మోదీకి ప్రజల నుంచి లభిస్తున్న మద్దతును రాహుల్​ జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రధాని మోదీ గురించి రాహుల్​ చేస్తున్న వ్యాఖ్యలను చూస్తోంటే ఆయన మానసిక ఆరోగ్యంలో ఏమైనా సమస్యలు ఉన్నాయోమోనని అనిపిస్తోంది.

భద్రతా దళాల త్యాగాలను విస్మరిస్తూ మీరు ఎవరిని సమర్థిస్తున్నారు? ఎందుకు సమర్థిస్తున్నారు? ఎందుకంటే.. మీ పార్టీకి కొంత విరాళం అందింది. చైనీయులతో మీ సమావేశాన్ని మరచిపోలేము. దేశ సార్వభౌమత్వంపై మీ హయాంలో పదేపదే జరిగిన దాడులకు చరిత్ర సాక్ష్యంగా నిలిచింది"

--ప్రహ్లాద్​ జోషి, కేంద్ర మంత్రి

'అందుకు సంతోషం'

మాజీ ప్రదాన మంత్రి నెహ్రూనే హిమాలయాల్లో సమస్యను సృషించారని కాంగ్రెస్​ అంగీకరిస్తున్నందుకు సంతోషంగా ఉందని భాజపా ప్రధాన కార్యదర్శి సీటీ రవి.. ట్విట్టర్​ వేదికగా వ్యాఖ్యానించారు. చైనాకు 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని మాజీ ప్రధాని నెహ్రూ అప్పగించారని ఆరోపించారు. ప్రధాని మోదీపై రాహుల్​ గాంధీ నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

'చైనాను ఎదుర్కోలేరు కానీ...'

రాజస్థాన్​ హునుమాన్​గఢ్​ జిల్లా పిలిబంగా​లో​ రైతులతో సమావేశమైన రాహుల్​.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోసారి విమర్శలు గుప్పించారు. చైనాతో తలబడలేని మోదీ.. సాగు చట్టాలతో రైతులపై బెదిరింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. ఈ చట్టాలతో మోదీ తన స్నేహితులకు ప్రయోజనం చేకూర్చేందుకు యత్నిస్తున్నారని ​ విమర్శించారు.

నూతన సాగు చట్టాలను అమలు చేస్తే 40 శాతం మంది రైతులు, వ్యాపారులు, కూలీలు నష్టపోతారు. పెద్దనోట్ల రద్దు తర్వాత జీఎస్టీనీ తీసుకువచ్చారు. దానివల్ల చిరు, మధ్య ఆదాయ వ్యాపారులకు తీవ్ర నష్టం జరిగింది. నరేంద్ర మోదీ తన స్నేహితులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తూర్పు లద్దాఖ్​లో ఫింగర్​ 3 నుంచి ఫింగర్​ 4 మధ్య ప్రాంతాన్ని చైనాకు భారత ప్రభుత్వం అప్పగించింది. చైనాకు ఎదురువెళ్లి నిలబడలేని మోదీ.. రైతులను మాత్రం బెదిరిస్తున్నారు. "

-- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

రైతులు, కార్మికులు, చిరు వ్యాపారుల శక్తి ఏంటో ప్రధాని అర్థం చేసుకోలేకపోతున్నారని రాహుల్​ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:'సాగు చట్టాలపై 2024 వరకు ఉద్యమం!'

భారత్-చైనా సరిహద్దు ప్రతిష్టంభనపై అధికార ​భాజపా, విపక్ష కాంగ్రెస్​​ మధ్య మాటల పోరు తీవ్రమవుతోంది. భారత భూగాన్ని చైనాకు మోదీ అప్పంగించారని రాహుల్​ చేసిన వ్యాఖ్యలపై భాజపా కౌంటర్​ ఇచ్చింది. రాహుల్​ భారత భద్రతా బలగాల త్యాగాలను అప్రతిష్ఠపాలు చేసేలా మాట్లాడుతున్నారని విమర్శించింది. 43,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు కాంగ్రెస్​ అప్పగించిన ఘటనను భారతీయులు ఎన్నటికీ మర్చిపోరని పేర్కొంది.

"నైతిక మనస్సాక్షి లేని వ్యక్తులు.. అబద్ధాలను ఆశ్రయిస్తారు. రాహుల్​ ఎడమ, కుడి, మధ్యస్థ అబద్ధాలు ఆడుతున్నారు. బహుశా ప్రధాని పదవినీ చేపట్టలేకపోయానన్న ఆవేదనలో ఆయన​ ఉండి ఉంటారు. తన నీడ కూడా తనను నమ్మదని ఆయనకూ తెలుసు. ప్రధాని మోదీకి ప్రజల నుంచి లభిస్తున్న మద్దతును రాహుల్​ జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రధాని మోదీ గురించి రాహుల్​ చేస్తున్న వ్యాఖ్యలను చూస్తోంటే ఆయన మానసిక ఆరోగ్యంలో ఏమైనా సమస్యలు ఉన్నాయోమోనని అనిపిస్తోంది.

భద్రతా దళాల త్యాగాలను విస్మరిస్తూ మీరు ఎవరిని సమర్థిస్తున్నారు? ఎందుకు సమర్థిస్తున్నారు? ఎందుకంటే.. మీ పార్టీకి కొంత విరాళం అందింది. చైనీయులతో మీ సమావేశాన్ని మరచిపోలేము. దేశ సార్వభౌమత్వంపై మీ హయాంలో పదేపదే జరిగిన దాడులకు చరిత్ర సాక్ష్యంగా నిలిచింది"

--ప్రహ్లాద్​ జోషి, కేంద్ర మంత్రి

'అందుకు సంతోషం'

మాజీ ప్రదాన మంత్రి నెహ్రూనే హిమాలయాల్లో సమస్యను సృషించారని కాంగ్రెస్​ అంగీకరిస్తున్నందుకు సంతోషంగా ఉందని భాజపా ప్రధాన కార్యదర్శి సీటీ రవి.. ట్విట్టర్​ వేదికగా వ్యాఖ్యానించారు. చైనాకు 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని మాజీ ప్రధాని నెహ్రూ అప్పగించారని ఆరోపించారు. ప్రధాని మోదీపై రాహుల్​ గాంధీ నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

'చైనాను ఎదుర్కోలేరు కానీ...'

రాజస్థాన్​ హునుమాన్​గఢ్​ జిల్లా పిలిబంగా​లో​ రైతులతో సమావేశమైన రాహుల్​.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోసారి విమర్శలు గుప్పించారు. చైనాతో తలబడలేని మోదీ.. సాగు చట్టాలతో రైతులపై బెదిరింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. ఈ చట్టాలతో మోదీ తన స్నేహితులకు ప్రయోజనం చేకూర్చేందుకు యత్నిస్తున్నారని ​ విమర్శించారు.

నూతన సాగు చట్టాలను అమలు చేస్తే 40 శాతం మంది రైతులు, వ్యాపారులు, కూలీలు నష్టపోతారు. పెద్దనోట్ల రద్దు తర్వాత జీఎస్టీనీ తీసుకువచ్చారు. దానివల్ల చిరు, మధ్య ఆదాయ వ్యాపారులకు తీవ్ర నష్టం జరిగింది. నరేంద్ర మోదీ తన స్నేహితులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తూర్పు లద్దాఖ్​లో ఫింగర్​ 3 నుంచి ఫింగర్​ 4 మధ్య ప్రాంతాన్ని చైనాకు భారత ప్రభుత్వం అప్పగించింది. చైనాకు ఎదురువెళ్లి నిలబడలేని మోదీ.. రైతులను మాత్రం బెదిరిస్తున్నారు. "

-- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

రైతులు, కార్మికులు, చిరు వ్యాపారుల శక్తి ఏంటో ప్రధాని అర్థం చేసుకోలేకపోతున్నారని రాహుల్​ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:'సాగు చట్టాలపై 2024 వరకు ఉద్యమం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.