నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు.. గాజీపుర్ సరిహద్దు వద్ద తాత్కాలిక నివాసాలను ఏర్పరచుకున్నారు. ఎండ తీవ్రతను తట్టుకునేందుకు వెదురు బొంగులతో గుడిసెలను నిర్మించారు. త్రివర్ణపతాకం ప్రతిబింబించేలా జాతీయ జెండా రంగులను గుడిసెలకు అద్దారు. పర్యావరణ రహితంగా గుడిసెలను నిర్మించినట్లు ఓ రైతు తెలిపారు. ధైర్యం, ఉత్సాహం కోసం నివాసాలపై త్రివర్ణ పతాక రంగులను వేశామన్నారు.
![As NCR reels under heat, farmers at Ghazipur (Delhi-UP) border are building tricolour-themed bamboo huts.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11271781_3.jpg)
![As NCR reels under heat, farmers at Ghazipur (Delhi-UP) border are building tricolour-themed bamboo huts.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11271781_1.jpg)
![As NCR reels under heat, farmers at Ghazipur (Delhi-UP) border are building tricolour-themed bamboo huts.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11271781_img.jpg)
రైతులు.. తమ సంకల్పం ఎంత దృఢమైనదో తెలిపేందుకు గతంలోనూ సరిహద్దుల్లో ఇళ్లను నిర్మించుకున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో నాలుగు నెలలకుపైగా ఉద్యమం కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి : కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్పై మోదీ సమీక్ష