ETV Bharat / bharat

సరిహద్దులో 400 మంది ఉగ్రవాదులు!

author img

By

Published : Jan 6, 2021, 10:07 PM IST

Updated : Jan 6, 2021, 10:41 PM IST

జమ్ముకశ్మీర్​లోకి అక్రమంగా చొరబడెేందుకు పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని లాంచ్​ ప్యాడ్ల వద్ద 400 మంది ఉగ్రవాదులు వేచి ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. శీతాకాలంలో భారీగా మంచు కురుస్తున్నప్పటికీ పాకిస్థాన్​ ఎగదోస్తున్న ముష్కరులు చొరబాటుకు యత్నిస్తున్నారని పేర్కొన్నాయి. భద్రతా దళాల పటిష్ఠ నిఘాతో వారి ఆటలు సాగడం లేదని చెప్పాయి.

Around 400 terrorists in launch pads across LoC waiting to infiltrate, Pak planning to push them in winter: Officials
సరిహద్దులో 400మంది ఉగ్రవాదులు

పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని లాంచ్ ప్యాడ్ల వద్ద 400మంది ముష్కరులు భారత్​లోకి ఎప్పుడు చొరబడుదామా అని ఎదురుచూస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. శీతాకాలంలో భారీగా మంచు కురుస్తున్నప్పటికీ జమ్ముకశ్మీర్​లోకి ప్రవేశించేందుకు వారు ప్రయత్నిన్నట్లు పేర్కొన్నాయి. అయితే భద్రతా దళాల పటిష్ఠ నిఘా, చొరబాటు వ్యతిరేక చర్యల కారణంగా పాకిస్థాన్ ఉసిగొల్పుతున్న ముష్కరులు భారత్​లోకి ప్రవేశించలేకపోతున్నారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

2020లో జమ్ముకశ్మీర్​ సరిహద్దు వెంబడి 44 చొరబాటు ఘటనలు జరిగాయి. 2019లో ఆ సంఖ్య 141గా ఉంది. 2018లో 143 మంది ముష్కరులు కశ్మీర్​లోకి అక్రమంగా ప్రవేశించారు.

సరిహద్దు వెంబడి కీలక మార్గాలను మూసివేయడం, చొరబాటు నిరోధక చర్యలు చేపట్టడం వల్ల ఈ సారి పాక్​ ఉగ్రవాదుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో కాల్పుల విరమణ పదే పదే ఉల్లంఘించింది దాయాది దేశ సైన్యం. 2003నుంచి ఎన్నడూ లేని స్థాయిలో 2020లో ఏకంగా 5,100 సార్లు కవ్వింపు చర్యలకు పాల్పడింది. మోర్టార్ షెల్స్ విసిరి, కాల్పులు జరపడం ద్వారా ఉగ్రవాదులను కశ్మీర్​లోని పంపే కుట్రలు చేసింది.

జమ్ముకశ్మీర్​లోకి ఉగ్రవాదులను పంపి ప్రశాంత వాతావరణాన్ని హింసాత్మకంగా మార్చేందుకు పాక్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్​లో ప్రస్తుతం 300 నుంచి 415 మంది ముష్కరులు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. నియంత్రణ రేఖ వెంబడి పీర్​ పంజల్ లోయ ఉత్తర భాగంలో 175-210 మంది, దక్షిణ భాగంలో 119-216 మంది ముష్కరులు ఉన్నట్లు తెలిపాయి. సొరంగ మార్గాల ద్వారా ఉగ్రవాదులను ఆయుధాలు, పేలుడు పదార్థాలతో కశ్మీర్​లోకి పంపేందుకు పాక్​ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని లాంచ్ ప్యాడ్ల వద్ద 400మంది ముష్కరులు భారత్​లోకి ఎప్పుడు చొరబడుదామా అని ఎదురుచూస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. శీతాకాలంలో భారీగా మంచు కురుస్తున్నప్పటికీ జమ్ముకశ్మీర్​లోకి ప్రవేశించేందుకు వారు ప్రయత్నిన్నట్లు పేర్కొన్నాయి. అయితే భద్రతా దళాల పటిష్ఠ నిఘా, చొరబాటు వ్యతిరేక చర్యల కారణంగా పాకిస్థాన్ ఉసిగొల్పుతున్న ముష్కరులు భారత్​లోకి ప్రవేశించలేకపోతున్నారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

2020లో జమ్ముకశ్మీర్​ సరిహద్దు వెంబడి 44 చొరబాటు ఘటనలు జరిగాయి. 2019లో ఆ సంఖ్య 141గా ఉంది. 2018లో 143 మంది ముష్కరులు కశ్మీర్​లోకి అక్రమంగా ప్రవేశించారు.

సరిహద్దు వెంబడి కీలక మార్గాలను మూసివేయడం, చొరబాటు నిరోధక చర్యలు చేపట్టడం వల్ల ఈ సారి పాక్​ ఉగ్రవాదుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో కాల్పుల విరమణ పదే పదే ఉల్లంఘించింది దాయాది దేశ సైన్యం. 2003నుంచి ఎన్నడూ లేని స్థాయిలో 2020లో ఏకంగా 5,100 సార్లు కవ్వింపు చర్యలకు పాల్పడింది. మోర్టార్ షెల్స్ విసిరి, కాల్పులు జరపడం ద్వారా ఉగ్రవాదులను కశ్మీర్​లోని పంపే కుట్రలు చేసింది.

జమ్ముకశ్మీర్​లోకి ఉగ్రవాదులను పంపి ప్రశాంత వాతావరణాన్ని హింసాత్మకంగా మార్చేందుకు పాక్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్​లో ప్రస్తుతం 300 నుంచి 415 మంది ముష్కరులు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. నియంత్రణ రేఖ వెంబడి పీర్​ పంజల్ లోయ ఉత్తర భాగంలో 175-210 మంది, దక్షిణ భాగంలో 119-216 మంది ముష్కరులు ఉన్నట్లు తెలిపాయి. సొరంగ మార్గాల ద్వారా ఉగ్రవాదులను ఆయుధాలు, పేలుడు పదార్థాలతో కశ్మీర్​లోకి పంపేందుకు పాక్​ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

Last Updated : Jan 6, 2021, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.