ETV Bharat / bharat

హైదరాబాద్​కు 'కంగారూ' స్మగ్లింగ్- ఇద్దరు అరెస్ట్

అసోం సరిహద్దులో ఆస్ట్రేలియన్​ కంగారూను అక్రమ రవాణా చేస్తున్న ట్రక్కును పట్టుకున్నారు బంగాల్​ పోలీసులు. కంగారూను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్​ చేశారు. నిందితులను హైదరాబాద్​కు చెందిన వారిగా గుర్తించారు.

author img

By

Published : Mar 17, 2022, 6:57 PM IST

Kangaroo
బోనులో తరలిస్తున్న కంగారూ

ఆస్ట్రేలియన్​ కంగారూను అక్రమంగా తరలిస్తుండగా బంగాల్​లోని అలిపుర్​దౌర్​ జిల్లా పక్రిబారి ప్రాంతంలో పట్టుకున్నారు పోలీసులు. జిల్లాలోని కుమార్​గ్రామ్​ పోలీస్​ స్టేషన్​ పరిధి బరోబిశా ఔట్​పోస్ట్​ బంగల్​-అసోం సరిహద్దులో తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు.

Kangaroo
పోలీసులు స్వాధీనం చేసుకున్న కంగారూ

"పక్రిబారి సరిహద్దు ప్రాంతంలో 24 గంటలు తనిఖీలు జరుగుతాయి. ఓ ట్రక్కును తనిఖీ చేయగా అందులో ఒక పెద్ద బోను కనిపించింది. దానిని టార్పాలిన్​తో కప్పి తరలిస్తున్నారు. అలాంటి బోన్లను సాధారణంగా జంతువులను తరలించటానికి ఉపయోగిస్తారు. ఆ బోనులోంచి ఆస్ట్రేలియన్​ కంగారూను స్వాధీనం చేసుకున్నాం. ట్రక్కును సీజ్​ చేసి డ్రైవర్​తో పాటు సహయకుడిని అరెస్ట్​ చేశాం. భారత్​లో కొన్ని జంతు ప్రదర్శనశాలల్లోనే కంగారూలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కంగారూను పోలీస్​ స్టేషన్​లోనే ఉంచాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. రాష్ట్ర అటవీ శాఖకు కంగారూను అప్పగిస్తాం. "

- బాసుదేవ్​ సర్కార్​, కుమార్​గ్రామ్​ పోలీస్​ స్టేషన్​ ఇంఛార్జ్​

గువాహటి నుంచి హైదరాబాద్​కు..

ఈ కంగారూను అసోంలోని గువాహటి నుంచి తీసుకొచ్చారని, దానిని హైదరాబాద్​కు తరలిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో అరెస్టయిన ఇమ్రాన్​ షేక్​, జాహిద్​ షేక్​ను హైదరాబాద్​కు చెందిన వారిగా గుర్తించామన్నారు. దేశంలోనే కంగారూను పట్టుకోవటం ఇదే తొలిసారిగా పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రోడ్డుపై ఎద్దులు హల్​చల్​- బుల్​ఫైట్ వీడియో వైరల్

ఆస్ట్రేలియన్​ కంగారూను అక్రమంగా తరలిస్తుండగా బంగాల్​లోని అలిపుర్​దౌర్​ జిల్లా పక్రిబారి ప్రాంతంలో పట్టుకున్నారు పోలీసులు. జిల్లాలోని కుమార్​గ్రామ్​ పోలీస్​ స్టేషన్​ పరిధి బరోబిశా ఔట్​పోస్ట్​ బంగల్​-అసోం సరిహద్దులో తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు.

Kangaroo
పోలీసులు స్వాధీనం చేసుకున్న కంగారూ

"పక్రిబారి సరిహద్దు ప్రాంతంలో 24 గంటలు తనిఖీలు జరుగుతాయి. ఓ ట్రక్కును తనిఖీ చేయగా అందులో ఒక పెద్ద బోను కనిపించింది. దానిని టార్పాలిన్​తో కప్పి తరలిస్తున్నారు. అలాంటి బోన్లను సాధారణంగా జంతువులను తరలించటానికి ఉపయోగిస్తారు. ఆ బోనులోంచి ఆస్ట్రేలియన్​ కంగారూను స్వాధీనం చేసుకున్నాం. ట్రక్కును సీజ్​ చేసి డ్రైవర్​తో పాటు సహయకుడిని అరెస్ట్​ చేశాం. భారత్​లో కొన్ని జంతు ప్రదర్శనశాలల్లోనే కంగారూలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కంగారూను పోలీస్​ స్టేషన్​లోనే ఉంచాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. రాష్ట్ర అటవీ శాఖకు కంగారూను అప్పగిస్తాం. "

- బాసుదేవ్​ సర్కార్​, కుమార్​గ్రామ్​ పోలీస్​ స్టేషన్​ ఇంఛార్జ్​

గువాహటి నుంచి హైదరాబాద్​కు..

ఈ కంగారూను అసోంలోని గువాహటి నుంచి తీసుకొచ్చారని, దానిని హైదరాబాద్​కు తరలిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో అరెస్టయిన ఇమ్రాన్​ షేక్​, జాహిద్​ షేక్​ను హైదరాబాద్​కు చెందిన వారిగా గుర్తించామన్నారు. దేశంలోనే కంగారూను పట్టుకోవటం ఇదే తొలిసారిగా పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రోడ్డుపై ఎద్దులు హల్​చల్​- బుల్​ఫైట్ వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.