ETV Bharat / bharat

బీజాపుర్​ ఎన్​కౌంటర్​లో 23 మంది జవాన్లు మృతి

author img

By

Published : Apr 4, 2021, 11:37 AM IST

Updated : Apr 4, 2021, 6:41 PM IST

ANI reporter on the ground sees 14 bodies recovered from the site of Sukma Naxal attack in Chhattisgarh; details awaited
బీజాపుర్​ ఎన్​కౌంటర్​- 14 మృతదేహాలు లభ్యం!

11:28 April 04

బీజాపుర్​ ఎన్​కౌంటర్​లో 23 మంది జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లాలో నక్సల్స్​కు, భద్రతా సిబ్బందికి మధ్య శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన జవాన్ల సంఖ్య 23కు చేరింది. శనివారం ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. ఆదివారం మరో 18 మంది మృతదేహాలను గుర్తించారు. ఈ మేరకు బీజాపుర్​ ఎస్​పీ కమలోచన్​ కశ్యప్​ తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో 31 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. కొంతమంది గల్లంతు కాగా అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.  

భద్రతా దళాల నుంచి 20కిపైగా ఆయుధాలను నక్సల్స్‌ లూటీ చేసినట్లు సీఆర్​పీఎఫ్​ వర్గాలు తెలిపాయి.  

రాష్ట్రపతి విచారం..

ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. అమర జవాన్ల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

మోదీ, షా నివాళులు

ఎన్​కౌంటర్​ ఘటన నేపథ్యంలో సీఆర్​పీఎఫ్​ డైరెక్టర్​ జనరల్​ కుల్దీ​ప్‌ సింగ్‌ ఆదివారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌కు చేరుకున్నారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ప్రస్తుత పరిస్థితులపై ఆయన ఆరాతీస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ ‌షా స్పందించారు. అమరులైన జవాన్లకు వీరు నివాళి అర్పించారు. ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బఘెల్‌కు అమిత్‌ షా ఫోన్‌ చేసి పరిస్థితిపై ఆరా తీశారు.

నక్సల్‌ ఏరివేతలో భాగంగా కోబ్రా దళాలు, డీఆర్​జీ బలగాలు, ఎస్​టీఎఫ్​ సిబ్బంది సంయుక్తంగా.. బీజాపుర్‌ జిల్లా అడవుల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి కూంబింగ్‌ చేపట్టారు. ఈ క్రమంలో సుకుమా, బీజాపుర్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో బలగాలకు నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. 3 గంటల పాటు కొనసాగిన ఈ ఎదురుకాల్పుల్లో.. నక్సల్స్‌ వైపు కూడా భారీ ప్రాణనష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

11:28 April 04

బీజాపుర్​ ఎన్​కౌంటర్​లో 23 మంది జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లాలో నక్సల్స్​కు, భద్రతా సిబ్బందికి మధ్య శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన జవాన్ల సంఖ్య 23కు చేరింది. శనివారం ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. ఆదివారం మరో 18 మంది మృతదేహాలను గుర్తించారు. ఈ మేరకు బీజాపుర్​ ఎస్​పీ కమలోచన్​ కశ్యప్​ తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో 31 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. కొంతమంది గల్లంతు కాగా అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.  

భద్రతా దళాల నుంచి 20కిపైగా ఆయుధాలను నక్సల్స్‌ లూటీ చేసినట్లు సీఆర్​పీఎఫ్​ వర్గాలు తెలిపాయి.  

రాష్ట్రపతి విచారం..

ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. అమర జవాన్ల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

మోదీ, షా నివాళులు

ఎన్​కౌంటర్​ ఘటన నేపథ్యంలో సీఆర్​పీఎఫ్​ డైరెక్టర్​ జనరల్​ కుల్దీ​ప్‌ సింగ్‌ ఆదివారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌కు చేరుకున్నారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ప్రస్తుత పరిస్థితులపై ఆయన ఆరాతీస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ ‌షా స్పందించారు. అమరులైన జవాన్లకు వీరు నివాళి అర్పించారు. ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బఘెల్‌కు అమిత్‌ షా ఫోన్‌ చేసి పరిస్థితిపై ఆరా తీశారు.

నక్సల్‌ ఏరివేతలో భాగంగా కోబ్రా దళాలు, డీఆర్​జీ బలగాలు, ఎస్​టీఎఫ్​ సిబ్బంది సంయుక్తంగా.. బీజాపుర్‌ జిల్లా అడవుల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి కూంబింగ్‌ చేపట్టారు. ఈ క్రమంలో సుకుమా, బీజాపుర్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో బలగాలకు నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. 3 గంటల పాటు కొనసాగిన ఈ ఎదురుకాల్పుల్లో.. నక్సల్స్‌ వైపు కూడా భారీ ప్రాణనష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Last Updated : Apr 4, 2021, 6:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.