పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్(Captain Amarinder Singh).. కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు(Amarinder Singh new party). పంజాబ్ ప్రజలు, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. (Amarinder Singh news) రాష్ట్రంలో భాజపాతో పొత్తుపెట్టుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. రైతుల సమస్య పరిష్కారమైతే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీ చేయనున్నట్లు తెలిపారు. కలిసొచ్చే పార్టీలతోనూ జట్టు కట్టేందుకు సిద్ధమేనని ప్రకటించారు.
![CAPTAIN AMARINDER](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/whatsapp-image-2021-10-19-at-102000-pm_1910newsroom_1634662575_762.jpeg)
![CAPTAIN AMARINDER](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/whatsapp-image-2021-10-19-at-101734-pm_1910newsroom_1634662575_13.jpeg)
ఇటీవలే కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్ షాతో భేటీ అయ్యారు అమరిందర్ సింగ్. భాజపాలో చేరుతారని అప్పుడు ఊహాగానాలు వచ్చాయి. అయితే వాటిని అమరిందర్ ఖండించారు. భాజపాలో చేరడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్లో కొనసాగేదీ లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ ప్రకటన చేశారు.
![CAPTAIN AMARINDER](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/whatsapp-image-2021-10-19-at-101519-pm_1910newsroom_1634662575_23.jpeg)
ఇవీ చదవండి: