ETV Bharat / bharat

'భాజపా వ్యాక్సిన్​ను తీసుకునే ప్రసక్తే లేదు'

author img

By

Published : Jan 2, 2021, 5:25 PM IST

యావత్‌ దేశం కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్న వేళ యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌-19 టీకాను తాను తీసుకోబోనని చెప్పారు. అది భాజపా వ్యాక్సిన్‌ అని, దాన్ని ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. అఖిలేష్​ వ్యాఖ్యలను భాజపా తప్పుబట్టింది.

UP-VACCINE-AKHILESH
'భాజపా వ్యాక్సిన్​ను తీసుకునే ప్రసక్తే లేదు'

కరోనా వ్యాక్సిన్​ 'కొవిషీల్డ్'ను భాజపా టీకాగా అభివర్ణించారు సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్​. భాజపా వ్యాక్సిన్‌ను తాను వేయించుకోనని తెలిపారు. ఈ టీకాను తాను విశ్వసించబోనని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చప్పట్లతో కరోనా అంతం అవుతుందని చెప్పిందన్న అఖిలేష్‌.. డ్రైరన్‌ లాంటి కార్యక్రమాలు ఎందుకని ప్రశ్నించారు. విపక్షాలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరాదనే కేంద్రం కరోనా పేరుతో కార్యక్రమాలు చేస్తోందని విమర్శించారు. 2022లో ఉత్తర్​ప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపిన అఖిలేష్‌.. అప్పుడు యూపీ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్‌ అందజేస్తామని వెల్లడించారు.

అఖిలేష్​ వ్యాఖ్యలను భాజపా తప్పుబట్టింది. అఖిలేష్​ తన వ్యాఖ్యల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే కాకుండా కష్టపడి వ్యాక్సిన్​ తయారు చేసిన వైద్యులు, శాస్త్రవేత్తలను కూడా అవమానించారని ఉత్తర్​ప్రదేశ్​ ఉపముఖ్యమంత్రి కేశవ్​ ప్రసాద్​ మౌర్య అన్నారు.

''అఖిలేష్​ యాదవ్​కు టీకాపై నమ్మకం లేదు. అలాగే ఉత్తర్​ప్రదేశ్​ ప్రజలకు అఖిలేష్​పై నమ్మకం లేదు. కరోనా టీకా సమర్థతపై ప్రశ్నలు లేవనెత్తడం డాక్టర్లు, శాస్త్రవేత్తలు​ అవమానించడమే.''

-కేశవ్​ ప్రసాద్​ మౌర్య, యూపీ ఉపముఖ్యమంత్రి

అఖిలేష్​ నిర్ణయాన్ని దురదృష్టకర ఘటనగా కేంద్ర ఆర్థిక మంత్రి అనురాగ్​ ఠాకూర్​ అభివర్ణించారు.

''రాజకీయాలను కరోనా టీకాకు ముడిపెట్టడం ఒక పనికిమాలిన చర్య. ఒక యువనేత ఇలా ఆలోచించడం దురదృష్టకరం. అఖిలేష్ రాజకీయాలు తప్ప ఇంకేమీ ఆలోచించలేరు.''

- అనురాగ్​ ఠాకూర్, కేంద్ర మంత్రి

ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో టీకా ఆశలు

కరోనా వ్యాక్సిన్​ 'కొవిషీల్డ్'ను భాజపా టీకాగా అభివర్ణించారు సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్​. భాజపా వ్యాక్సిన్‌ను తాను వేయించుకోనని తెలిపారు. ఈ టీకాను తాను విశ్వసించబోనని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చప్పట్లతో కరోనా అంతం అవుతుందని చెప్పిందన్న అఖిలేష్‌.. డ్రైరన్‌ లాంటి కార్యక్రమాలు ఎందుకని ప్రశ్నించారు. విపక్షాలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరాదనే కేంద్రం కరోనా పేరుతో కార్యక్రమాలు చేస్తోందని విమర్శించారు. 2022లో ఉత్తర్​ప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపిన అఖిలేష్‌.. అప్పుడు యూపీ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్‌ అందజేస్తామని వెల్లడించారు.

అఖిలేష్​ వ్యాఖ్యలను భాజపా తప్పుబట్టింది. అఖిలేష్​ తన వ్యాఖ్యల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే కాకుండా కష్టపడి వ్యాక్సిన్​ తయారు చేసిన వైద్యులు, శాస్త్రవేత్తలను కూడా అవమానించారని ఉత్తర్​ప్రదేశ్​ ఉపముఖ్యమంత్రి కేశవ్​ ప్రసాద్​ మౌర్య అన్నారు.

''అఖిలేష్​ యాదవ్​కు టీకాపై నమ్మకం లేదు. అలాగే ఉత్తర్​ప్రదేశ్​ ప్రజలకు అఖిలేష్​పై నమ్మకం లేదు. కరోనా టీకా సమర్థతపై ప్రశ్నలు లేవనెత్తడం డాక్టర్లు, శాస్త్రవేత్తలు​ అవమానించడమే.''

-కేశవ్​ ప్రసాద్​ మౌర్య, యూపీ ఉపముఖ్యమంత్రి

అఖిలేష్​ నిర్ణయాన్ని దురదృష్టకర ఘటనగా కేంద్ర ఆర్థిక మంత్రి అనురాగ్​ ఠాకూర్​ అభివర్ణించారు.

''రాజకీయాలను కరోనా టీకాకు ముడిపెట్టడం ఒక పనికిమాలిన చర్య. ఒక యువనేత ఇలా ఆలోచించడం దురదృష్టకరం. అఖిలేష్ రాజకీయాలు తప్ప ఇంకేమీ ఆలోచించలేరు.''

- అనురాగ్​ ఠాకూర్, కేంద్ర మంత్రి

ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో టీకా ఆశలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.