ETV Bharat / bharat

బంగాల్​ మంత్రి సుబ్రతా ముఖర్జీ మృతి.. దీదీ విచారం - బంగాల్ పంచాయతీశాఖ మంత్రి మృతి

బంగాల్ పంచాయతీశాఖ మంత్రి సుబ్రతా ముఖర్జీ(75) మృతిచెందారు. అనారోగ్య సమస్యలతో గతవారం ఆస్పత్రిలో చేరిన ముఖర్జీ.. గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు బంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు.

Subrata Mukherjee dies
రాష్ట్ర పంచాయతీశాఖ మంత్రి మృతి
author img

By

Published : Nov 4, 2021, 10:57 PM IST

తృణమూల్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర పంచాయతీశాఖ మంత్రి సుబ్రతా ముఖర్జీ(75) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కోల్​కతాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతిచెందినట్లు బంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు.

" ముఖర్జీ మనతో లేరంటే నమ్మలేకపోతున్నా. ముఖర్జీ ఎంతో నిబద్ధత కలిగిన నాయకుడు. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా లోటు."

-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం

గతవారం శ్వాసతీసుకోవటంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడటం వల్ల ముఖర్జీని ఐసీయూకు తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: మూడు నెలల పసికందుతో సహా కుటుంబం మొత్తం ఆత్మహత్య!

తృణమూల్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర పంచాయతీశాఖ మంత్రి సుబ్రతా ముఖర్జీ(75) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కోల్​కతాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతిచెందినట్లు బంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు.

" ముఖర్జీ మనతో లేరంటే నమ్మలేకపోతున్నా. ముఖర్జీ ఎంతో నిబద్ధత కలిగిన నాయకుడు. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా లోటు."

-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం

గతవారం శ్వాసతీసుకోవటంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడటం వల్ల ముఖర్జీని ఐసీయూకు తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: మూడు నెలల పసికందుతో సహా కుటుంబం మొత్తం ఆత్మహత్య!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.