మహారాష్ట్ర పుణె హడ్పసర్లోని ఓ మున్సిపల్ పాఠశాలలో అనూహ్య ఘటన జరిగింది. అధికారులు మధ్యాహ్న భోజన పథకం కింద.. పశువుల దాణా పంపడం తీవ్ర కలకలం రేపింది. ఆ ప్రాంతంలో ఐదు మున్సిపల్ పాఠశాలలు సహా.. మొత్తం 58 స్కూళ్లు ఉన్నాయి. ఆయా స్కూళ్లకు పంపే ఆహారంలో 40 బస్తాలు నాసిరకంగా( పశువుల దాణా) ఉందని అధికారులు తెలిపారు. దీన్ని గమనించిన అక్కడి ఎన్సీపీ కార్యకర్త.. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని కోరారు.

లాక్డౌన్ కారణంగా.. గతేడాది మూతపడ్డ పాఠశాలలు.. కొద్దిరోజుల క్రితమే తెరచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆహారం సరఫరా చేయగా.. ఇలా పశువుల దాణా, నాసిరకం ధాన్యం పంపినట్టు తేలింది. ఈ ఘటనపై స్పందించిన ఎఫ్డీఐ(భారత ఆహార సంస్థ).. వీటన్నిటినీ జప్తు చేసింది. తదుపరి చర్యలు చేపడతామని చెప్పింది.


ఈ ఘటనను చాలా దురదృష్టకరంగా అభిప్రాయపడ్డారు స్థానిక మేయర్. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎఫ్డీఐని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: 20ఏళ్లుగా వానరాల ఆలనా పాలనే ఆమె దినచర్య