ఒడిశాలోని కలహండి జిల్లా ధర్మాఘర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. కోక్సొర పోలీస్స్టేషన్ పరిధిలోని బొడోకెందుగుడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగే సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 40 మందికి గాయాలవ్వగా.. 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
![a bus accident in odisha 40 people injured 20 people in serious condition](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9867903_567.jpg)
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. భారీ మలుపును డ్రైవర్ గుర్తించలేకపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.