ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో నేడు నాలుగో విడత పోలింగ్​

author img

By

Published : Dec 7, 2020, 5:21 AM IST

జమ్ముకశ్మీర్ డీడీసీ ఎన్నికల్లో భాగంగా నేడు నాలుగో విడత పోలింగ్ జరగనుంది. 7 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 34 స్థానాలకు 249మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

4th phase DDC elections: Over 7 lakh voters to decide fate of 249 candidates on Monday
జమ్ముకశ్మీర్​లో నేడు నాలుగో విడత పోలింగ్​

జమ్ముకశ్మీర్​ స్థానిక సంస్థల ఎన్నికల(డీడీసీ)కు సోమవారం నాలుగో విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 34 స్థానాలకు 249మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7లక్షల మందికిపైగా ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాాత్రమే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశముంది. మొత్తం 1,910 పోలింగ్​ స్టేషన్లలో ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.

నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా ఖాళీగా ఉన్న 50 సర్పంచ్​ స్థానాలకు కూడా సోమవారమే పోలింగ్ జరగనుంది. 137 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

కశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికలను 8 విడతలుగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. నవంబర్​ 28, డిసెంబర్​1, డిసెంబర్​ 4న మొదటి మూడు దశల పోలింగ్ పూర్తయింది.

ఇదీ చూడండి: పుణెలో 17 మందిపై రష్యా టీకా ప్రయోగం

జమ్ముకశ్మీర్​ స్థానిక సంస్థల ఎన్నికల(డీడీసీ)కు సోమవారం నాలుగో విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 34 స్థానాలకు 249మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7లక్షల మందికిపైగా ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాాత్రమే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశముంది. మొత్తం 1,910 పోలింగ్​ స్టేషన్లలో ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.

నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా ఖాళీగా ఉన్న 50 సర్పంచ్​ స్థానాలకు కూడా సోమవారమే పోలింగ్ జరగనుంది. 137 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

కశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికలను 8 విడతలుగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. నవంబర్​ 28, డిసెంబర్​1, డిసెంబర్​ 4న మొదటి మూడు దశల పోలింగ్ పూర్తయింది.

ఇదీ చూడండి: పుణెలో 17 మందిపై రష్యా టీకా ప్రయోగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.