ETV Bharat / bharat

అసోం తొలిదశ ఎన్నికల బరిలో 267 మంది

author img

By

Published : Mar 14, 2021, 9:51 AM IST

అసోంలో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో 267 మంది పోటీ చేయనున్నారు. 47 స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో అసోం సీఎం సర్భానంద సోనోవాల్​, స్పీకర్​ హితేంద్ర నాథ్​ గోస్వామి సహా ఇతర మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండో దశ ఎన్నికల కోసం 408 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ​

267 candidates in fray in 1st phase of assembly polls of assam
అసోం తొలిదశ ఎన్నికల బరిలో 267 మంది

అసోంలో 47 స్థానాలకుగాను జరగనున్న మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో 267 మంది అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. కాగా 39 స్థానాలకు జరగనున్న రెండో దశ ఎన్నికల కోసం 408 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు అసోం ఎన్నికల ప్రధాన అధికారి రాహుల్​ దాస్​ తెలిపారు.

అసోం మొదటి దశ ఎన్నికల కోసం మొత్తం 295 నామినేషన్లు రాగా.. 10 మంది అభ్యర్థనలను తిరస్కరించినట్లు రాహుల్​ దాస్​ తెలిపారు. మరో 18 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని చెప్పారు.

తొలిదశ పోరులో ప్రముఖులు వీరే..

మొదటి దశ ఎన్నికల్లో భాజపా తరఫున మజులీ నుంచి అసోం ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్, జోహ్రత్​ నుంచి స్పీకర్​ హితేంద్ర నాథ్​ గోస్వామి, మంత్రులు రంజిత్​ దుత్తా, నబా కుమార్​ దోలే, సంజయ్​ కిషన్​ పోటీ చేయనున్నారు. అసోం కాంగ్రెస్​ అధ్యక్షుడు రిపున్​ బోరా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి భరత్​ నాథ్​ సహా తదితర ముఖ్యనేతలు ఈ ఎన్నికల్లో తమ భవితవ్యం తేల్చుకోనున్నారు.

అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను మార్చి 27, ఏప్రిల్​ 1, ఏప్రిల్​ 6న మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: తమిళనాడు ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా

అసోంలో 47 స్థానాలకుగాను జరగనున్న మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో 267 మంది అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. కాగా 39 స్థానాలకు జరగనున్న రెండో దశ ఎన్నికల కోసం 408 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు అసోం ఎన్నికల ప్రధాన అధికారి రాహుల్​ దాస్​ తెలిపారు.

అసోం మొదటి దశ ఎన్నికల కోసం మొత్తం 295 నామినేషన్లు రాగా.. 10 మంది అభ్యర్థనలను తిరస్కరించినట్లు రాహుల్​ దాస్​ తెలిపారు. మరో 18 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని చెప్పారు.

తొలిదశ పోరులో ప్రముఖులు వీరే..

మొదటి దశ ఎన్నికల్లో భాజపా తరఫున మజులీ నుంచి అసోం ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్, జోహ్రత్​ నుంచి స్పీకర్​ హితేంద్ర నాథ్​ గోస్వామి, మంత్రులు రంజిత్​ దుత్తా, నబా కుమార్​ దోలే, సంజయ్​ కిషన్​ పోటీ చేయనున్నారు. అసోం కాంగ్రెస్​ అధ్యక్షుడు రిపున్​ బోరా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి భరత్​ నాథ్​ సహా తదితర ముఖ్యనేతలు ఈ ఎన్నికల్లో తమ భవితవ్యం తేల్చుకోనున్నారు.

అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను మార్చి 27, ఏప్రిల్​ 1, ఏప్రిల్​ 6న మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: తమిళనాడు ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.