ముంబయిలో విదేశాలకు ఎగుమతి చేసేందుకు నిల్వచేసిన 2,200 రెమ్డెసివిర్ వయల్స్ను పోలీసులు, ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్డీఏ) అధికారులు సీజ్ చేశారు. ముందస్తుగా అందిన సమాచారంతో పోలీసులు, ఎఫ్డీఏ అధికారులు సబర్బన్ అందేరి, న్యూ మెరైన్ లైన్స్ ప్రాంతాల్లో సోదాలు చేసి వీటిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
తూర్పు అందేరీలోని మరోల్ ప్రాంతంలో 2,000 రెమ్డెసివిర్ వయల్స్ను, న్యూ మెరైన్ లైన్స్లో మరో 200 వయల్స్ను స్వాధీనం చేసుకున్నామని పోలీసుల అధికార ప్రతినిధి చైతన్య ఓ ప్రకటనలో తెలిపారు. వీటిని ఆసుపత్రులకు అందజేస్తామని చెప్పారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఎఫ్డీఏ అధికారుల సమన్వయంతో సోదాలు నిర్వహించినట్లు డీసీపీ మంజనాథ్ పేర్కొన్నారు.
కరోనా చికిత్సలో కీలకమైన రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఎగమతులపై కేంద్రం గతవారం నిషేధం విధించింది.
ఇదీ చూడండి: స్పుత్నిక్-వి 10 రోజుల్లో భారత్లోకి!
ఇదీ చూడండి: లాక్డౌన్పై యూపీ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట!