ETV Bharat / bharat

'దిల్లీ, చెన్నైలో హెల్త్ కంటైనర్లు.. ఎక్కడికైనా తీసుకెళ్లే వీలు' - ayushman bharat health containers

ఆయుష్మాన్ భారత్ పథకం (Ayushman Bharat yojana) వల్ల రాబోయే విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం వైద్య వ్యవస్థకు లభిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కింద దిల్లీ, చెన్నై నగరాల్లో రెండు కంటైనర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అన్ని వైద్య సౌకర్యాలు ఈ కంటైనర్లలో ఉంటాయని తెలిపారు. వీటిని రైళ్లు లేదా విమానాల్లో ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చని చెప్పారు.

HEALTH CONTAINER
మన్​సుఖ్ మాండవీయ
author img

By

Published : Oct 26, 2021, 2:37 PM IST

ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం (Ayushman Bharat) కింద దిల్లీ, చెన్నై నగరాల్లో 200 పడకల సామర్థ్యంతో రెండు కంటైనర్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి (Health minister of India) మన్​సుఖ్ మాండవీయ తెలిపారు. అన్ని వైద్య సౌకర్యాలు ఉండే ఈ కంటైనర్లను అత్యవసర సమయంలో ఎక్కడికైనా తీసుకెళ్లేలా రూపొందించనున్నట్లు వెల్లడించారు. రైళ్లు లేదా విమానాల్లో ఈ కంటైనర్లను మోసుకెళ్లొచ్చని చెప్పారు.

ఈ మేరకు విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాండవీయ(Mansukh Mandaviya Health Minister) .. దేశవ్యాప్తంగా 79,415 హెల్త్ అండ్ వెల్​నెస్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చినట్లు గుర్తు చేశారు. మొత్తం 1.5 లక్షల కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వైద్య సంరక్షణ రంగంలో కేంద్రం అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లే విధానాన్ని పాటిస్తోందని అన్నారు. వైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే అవకాశాన్ని కరోనా కల్పించిందని చెప్పారు. ఇందుకోసమే ఆయుష్మాన్ భారత్​ను (Ayushman Bharat yojana) రూ. 64 వేల కోట్ల నిధులతో ప్రారంభించినట్లు వివరించారు. దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలోనూ మంచి ల్యాబ్​లు అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.

"ఆయుష్మాన్ భారత్ మిషన్ (Ayushman Bharat yojana) అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. సగటున ప్రతి జిల్లాలో రూ.90 నుంచి రూ.100 కోట్ల నిధులను మౌలిక సదుపాయాలపై ఖర్చు చేస్తాం. తద్వారా రాబోయే విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం వైద్య వ్యవస్థకు చేకూరుతుంది. ఈ పథకం కింద జిల్లా స్థాయిలో 134 రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నాం."

-మన్​సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

కొవాగ్జిన్​ అనుమతులపై...

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్​ టీకాకు డబ్ల్యూహెచ్ఓ అత్యవసర అనుమతులు (Covaxin WHO approval) జారీ చేసే విషయంపై స్పందించారు మాండవీయ (Mansukh Mandaviya Health Minister). ఇప్పటికే సాంకేతిక కమిటీ టీకాను ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. మరో కమిటీ ముందుకు ప్రతిపాదనలు వెళ్లాయని తెలిపారు. మంగళవారం ఈ కమిటీ భేటీ అవుతుందని చెప్పారు. టీకా అనుమతులపై ఈ సమావేశం ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.

రాష్ట్రాలతో భేటీ!

మరోవైపు, అన్ని రాష్ట్రాల వైద్య శాఖ మంత్రులతో మాండవీయ మంగళవారం భేటీ కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వ్యాక్సినేషన్ వేగంగా చేపట్టడం, కరోనా కట్టడి సహా పలు అంశాలపై ఇందులో చర్చించనున్నట్లు వెల్లడించాయి.

ఇదీ చదవండి:

ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం (Ayushman Bharat) కింద దిల్లీ, చెన్నై నగరాల్లో 200 పడకల సామర్థ్యంతో రెండు కంటైనర్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి (Health minister of India) మన్​సుఖ్ మాండవీయ తెలిపారు. అన్ని వైద్య సౌకర్యాలు ఉండే ఈ కంటైనర్లను అత్యవసర సమయంలో ఎక్కడికైనా తీసుకెళ్లేలా రూపొందించనున్నట్లు వెల్లడించారు. రైళ్లు లేదా విమానాల్లో ఈ కంటైనర్లను మోసుకెళ్లొచ్చని చెప్పారు.

ఈ మేరకు విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాండవీయ(Mansukh Mandaviya Health Minister) .. దేశవ్యాప్తంగా 79,415 హెల్త్ అండ్ వెల్​నెస్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చినట్లు గుర్తు చేశారు. మొత్తం 1.5 లక్షల కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వైద్య సంరక్షణ రంగంలో కేంద్రం అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లే విధానాన్ని పాటిస్తోందని అన్నారు. వైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే అవకాశాన్ని కరోనా కల్పించిందని చెప్పారు. ఇందుకోసమే ఆయుష్మాన్ భారత్​ను (Ayushman Bharat yojana) రూ. 64 వేల కోట్ల నిధులతో ప్రారంభించినట్లు వివరించారు. దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలోనూ మంచి ల్యాబ్​లు అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.

"ఆయుష్మాన్ భారత్ మిషన్ (Ayushman Bharat yojana) అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. సగటున ప్రతి జిల్లాలో రూ.90 నుంచి రూ.100 కోట్ల నిధులను మౌలిక సదుపాయాలపై ఖర్చు చేస్తాం. తద్వారా రాబోయే విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం వైద్య వ్యవస్థకు చేకూరుతుంది. ఈ పథకం కింద జిల్లా స్థాయిలో 134 రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నాం."

-మన్​సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

కొవాగ్జిన్​ అనుమతులపై...

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్​ టీకాకు డబ్ల్యూహెచ్ఓ అత్యవసర అనుమతులు (Covaxin WHO approval) జారీ చేసే విషయంపై స్పందించారు మాండవీయ (Mansukh Mandaviya Health Minister). ఇప్పటికే సాంకేతిక కమిటీ టీకాను ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. మరో కమిటీ ముందుకు ప్రతిపాదనలు వెళ్లాయని తెలిపారు. మంగళవారం ఈ కమిటీ భేటీ అవుతుందని చెప్పారు. టీకా అనుమతులపై ఈ సమావేశం ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.

రాష్ట్రాలతో భేటీ!

మరోవైపు, అన్ని రాష్ట్రాల వైద్య శాఖ మంత్రులతో మాండవీయ మంగళవారం భేటీ కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వ్యాక్సినేషన్ వేగంగా చేపట్టడం, కరోనా కట్టడి సహా పలు అంశాలపై ఇందులో చర్చించనున్నట్లు వెల్లడించాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.