ETV Bharat / bharat

పుట్టినరోజు నాడే బాలిక​పై సామూహిక అత్యాచారం

author img

By

Published : Feb 21, 2022, 7:56 AM IST

Girl Gangrape: ఇంట్లో నుంచి అలిగి వెళ్లిపోయిన బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు మానవమృగాలు. కర్ణాటకలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

girl gang-rape
Karnataka

Girl Gangrape: కర్ణాటకలోని కోలార్​ జిల్లాలో దారుణం జరిగింది. పుట్టినరోజున దుస్తులు కొనివ్వలేదని ఇంట్లో నుంచి పారిపోయిన బాలిక హత్యాచారానికి గురైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ఏం జరిగిందంటే?

తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక.. శుక్రవారం తన పుట్టినరోజున కొత్త బట్టలు, చాక్​లెట్లు కొనివ్వలేదని తల్లిదండ్రులపై అలిగింది. స్కూల్​కి వెళ్లలేదు. బంగారపేట వెళ్లే బస్సు ఎక్కింది.

బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నిందితులు.. మాయమాటలు చెప్పి ఆమెకు దగ్గరయ్యారు.

Karnataka
నిందితులు

ఆ తర్వాత ఓ పార్క్​కు తీసుకెళ్లి సాయంత్రం వరకు గడిపారు. కాస్త పొద్దపోయిన తర్వాత.. తనిమడగు గ్రామానికి ఓ ప్రైవేటు బస్సులో బాలికను తీసుకెళ్లారు. దారి మధ్యలో నిందితులు మద్యం తీసుకున్నారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

బాలిక అరుపులు విన్న గ్రామస్థులు స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలికకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సను అందించారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: పెళ్లి మండపం నుంచి బాలికను ఎత్తుకెళ్లి గ్యాంగ్​ రేప్​!​

Girl Gangrape: కర్ణాటకలోని కోలార్​ జిల్లాలో దారుణం జరిగింది. పుట్టినరోజున దుస్తులు కొనివ్వలేదని ఇంట్లో నుంచి పారిపోయిన బాలిక హత్యాచారానికి గురైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ఏం జరిగిందంటే?

తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక.. శుక్రవారం తన పుట్టినరోజున కొత్త బట్టలు, చాక్​లెట్లు కొనివ్వలేదని తల్లిదండ్రులపై అలిగింది. స్కూల్​కి వెళ్లలేదు. బంగారపేట వెళ్లే బస్సు ఎక్కింది.

బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నిందితులు.. మాయమాటలు చెప్పి ఆమెకు దగ్గరయ్యారు.

Karnataka
నిందితులు

ఆ తర్వాత ఓ పార్క్​కు తీసుకెళ్లి సాయంత్రం వరకు గడిపారు. కాస్త పొద్దపోయిన తర్వాత.. తనిమడగు గ్రామానికి ఓ ప్రైవేటు బస్సులో బాలికను తీసుకెళ్లారు. దారి మధ్యలో నిందితులు మద్యం తీసుకున్నారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

బాలిక అరుపులు విన్న గ్రామస్థులు స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలికకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సను అందించారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: పెళ్లి మండపం నుంచి బాలికను ఎత్తుకెళ్లి గ్యాంగ్​ రేప్​!​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.