thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2023, 3:02 PM IST

ETV Bharat / Videos

'పిల్ల సైకో' పిచ్చి చేష్టలు - పాఠశాల దారికి అడ్డంగా ముళ్లకంచె వేసిన వైసీపీ నేత

YCP Leader Blocked Way to School: గ్రామాల్లో సైతం పిల్ల సైకోలు రెచ్చిపోతున్నారు. స్థల వివాదంతో పాఠశాలకు వెళ్లేదారిలో వైసీపీ నాయకుడు ముళ్ల కంప వేశాడు. దీంతో చాలా సమయం ఆరుబయటే విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరు మండలం సోమయాజుల పల్లెలో ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులు వెళ్లేందుకు వీలు లేకుండా దారికి అడ్డుగా కంప వేసిన ఘటన చోటుచేసుకుంది. స్థల వివాదంతో గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు దానికి అడ్డంగా కంప వేయడంతో పాఠశాలకు వెళ్లే దారి మూసుకుపోయింది. 

ఎప్పటిలాగానే ఈరోజు ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, దారిలో కంప వేయడంతో పాఠశాలకు వెళ్లకుండా ఆగిపోయారు. కాసేపటికి పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయులు ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివాదంపై ఆరా తీశారు. స్థల వివాదంతో పాఠశాలకు వెళ్లకుండా దారి మూసి వేయడాన్ని అధికారులు తప్పు పట్టారు. పాఠశాలకు ఇబ్బందులు లేకుండా చేయాలని సూచించడంతో దారికి అడ్డంగా వేసిన కంపని తొలగించారు. దీంతో విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాల చేరుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.