నెల్లూరులో ₹ 4వేల కోట్ల మైనింగ్ దోపిడీ - విజయసాయిరెడ్డి సూత్రధారి : సోమిరెడ్డి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2023, 5:51 PM IST

thumbnail

TDP Leader Somireddy comments on illegal mining in Nellore: నెల్లూరు జిల్లాలో 4,455 కోట్ల రూపాయల మైనింగ్ దోపిడీ జరుగుతోందని మాజీ మంత్రి, తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. దేశంలో జరిగిన భారీ మైనింగ్ దోపిడీల్లో మొదటి రెండు స్థానాలు ఓబులాపురం, మధుకోడా అయితే, తర్వాత రెండు స్థానాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందని సోమిరెడ్డి నెల్లూరులో విమర్శించారు. సిలికా, క్వార్ట్జ్ ను ఇష్టానుసారంగా దోచేస్తున్నారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

4455 కోట్లు విలువ చేసె మూడు కోట్ల టన్నులు విలువైన ఖనిజ సంపదను తరలించారని  సోమిరెడ్డి ఆరోపించారు. ఈ దోపిడీపై మైనింగ్, పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో మైన్స్ కుంభకోణం జరుగుతోందని, ప్రతి నెల లోటస్ పాండ్ కు కమీషన్లు చేరుతున్నాయని ఆరోపించారు. గత మూడేళ్లలో 371 కోట్ల రూపాయల పెనాల్టీ విధించిన ప్రభుత్వం, ఎంత మొత్తంలో వసూలు చేశారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంత్రి కాకాణి సొంత ఊరు పక్కనే క్వార్ట్జ్ అక్రమ తరలింపు యధేచ్ఛగా సాగుతున్నా పట్టించుకోవటం లేదని, కోర్టు ఉత్తర్వులను సైతం లెక్కచేయడం లేదన్నారు. ప్రజా సంపదను కొల్లగొడుతున్నా, పట్టించుకోని మైనింగ్ ఉన్నతాధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారని సోమిరెడ్డి ఆరోపించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.