MLA Rambabu Fired On Officers in Prakasam: అధికారులపై ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆగ్రహం.. ఎందుకంటే..! - ఎమ్మెల్యే రాంబాబు తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-10-2023/640-480-19757632-thumbnail-16x9-mla-rambabu.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 13, 2023, 5:52 PM IST
MLA Rambabu Fired On Officers in Prakasam: జలవనరుల శాఖ, విద్యాశాఖ అధికారుల తీరుపై ఒంగోలులోని జెడ్పీ సమావేశం వేదికగా గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019-20లో రూ. 85 లక్షలతో కంభం చెరువు అభివృద్ధి పనులు చేసినా.. ప్రభుత్వం ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదని మండిపడ్డారు. నాడు-నేడు కింద అవసరం లేకున్నా.. కొన్నిచోట్ల అదనపు తరగతి గదులు మంజూరు చేశారన్నారు. కూలిపోయేలా ఉన్న రాచర్ల పాఠశాలకు నాలుగేళ్లుగా గదులు మంజూరు చేయలేదని వాపోయారు. కంభం చెరువు, రాచర్ల పాఠశాల విషయంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఎంమ్మెల్యే రాంబాబు అసహనం వ్యక్తం చేశారు.
ZP Meeting In Prakasam 2023 : జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు సభ్యులు ప్రజా సమస్యలపై మాట్లాడారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించి, పాఠశాలలో త్వరలోనే తరగతి గదులు మంజూరు చేయించి, వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించేలా చూడాలని డీఈవోను ఆదేశించారు.