Minister Satyakumar on GBS Cases: గులియన్-బారే సిండ్రోమ్(GBS) కేసుల పట్ల వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్ష చేశారని తెలిపారు. గత ఏడాది రాష్ట్రంలో 301 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. గుంటూరు జీజిహెచ్లో అత్యధికందా కేసులు నమోదు అయ్యాయని వివరించారు. గుంటూరు, విశాఖ సహా ఆరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కువ సంఖ్యలో నమోదు కావడానికి ఇతర ప్రాంతాల నుంచి కేసులు రావడమే కారణమని అన్నారు. అక్కడకు రిఫరెన్స్లు ఎక్కవ ఉండడంతో కేసులు నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు.
జీబీఎస్ బారిన పడిన వారికి సరపడా ఇమ్యూనో గోబిలిన్ ఇంజక్షన్లు ఉన్నాయని మంత్రి స్పష్టం చేసారు. జీబీఎస్ భారిన పడ్డవారిలో 85 శాతం మంది చికిత్స లేకుండానే తగ్గిపోతుందని అన్నారు. ఈ వ్యాధికి సంభందించి చికిత్స అన్ని ప్రధాన ఆసుపత్రులలో ఉందని తెలిపారు. దీనికి సంభందించి రోజుకు 5 ఇంజక్షన్లు లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని వెల్లడించారు. 5 రోజులు పాటు ఈ ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
శ్రీవారి ఆలయంపై విమాన రాకపోకలు - విచారించి చర్యలకు ఆదేశిస్తాం : హోం మంత్రి అనిత
జీబీఎస్పై సీఎం చంద్రబాబు సమీక్ష - జాగ్రత్తలు పాటించాలని ఆదేశం