Goods Train Derailed in Kadapa District: కడప జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. నెలరోజుల వ్యవధిలో రెండోసారి - Accident news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-09-2023/640-480-19441363-thumbnail-16x9-goods-train-derailed-in-kadapa-district.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 6, 2023, 10:48 AM IST
Goods Train Derailed in Kadapa District: చెన్నై నుంచి కడపకు ఎరువుల లోడ్తో వస్తున్న గూడ్స్ రైలు మంగళవారం రాత్రి ఎర్రముక్కపల్లె సమీపంలో పట్టాలు తప్పింది. ఈ గూడ్స్ రైలు 42 వ్యాగన్లతో వస్తుంది. అందులో 21 వ్యాగన్లలో ఎరువులు మరో 21 వ్యాగన్లు ఖాళీగా ఉన్నాయి. కడప రైల్యే స్టేషన్ నుంచి మూడో ప్లాట్ఫాం మీదుగా ఎర్రముక్కపల్లె పాయింట్ వద్దకు చేరి అక్కడి నుంచి కడప గూడ్స్షెడ్కు వెనక్కి వచ్చే క్రమంలో ఖాళీ వ్యాగన్లు రెండు పట్టాలు తప్పాయి. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పట్టాలు తప్పిన వ్యాగన్లను సరి చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో గుంటూరు- తిరుపతి ఎక్స్ ప్రెస్, ఎగ్మోర్ రైలు ఆలస్యంగా నడిచాయి. రేణిగుంట నుంచి హైదరాబాదు ముంబై వైపు వెళ్లే రైలు యధావిధిగా నడిచాయి. ఈ నెలరోజుల వ్యవధిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనలు రెండు జరిగాయి. ఆగస్టు 9వ తేదీన డెమో రైలు కూడా ఇలానే వెనక్కి వచ్చే క్రమంలో పట్టాలు తప్పింది.