తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 'మెగా మేనల్లుడు'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2023, 4:59 PM IST

thumbnail

Film actor Sai dharam Tej visited Tirupathi: సినీ నటుడు, మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్(sai dharam tej) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ(VIP) ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. 

Tirumala Tirupati Devasthanam (TTD) Temple Authorities made Darshan Arrangements: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆలయ అధికారులు సాయిధరమ్ తేజ్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేశారు. గర్భ గుడిలో స్వామివారిని దర్శనం అనంతరం సాయిధరమ్ తేజ్‌ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సంపత్ నంది డైరెక్షన్​లో సంక్రాంతి తరువాత కొత్త సినిమా షూటింగ్ (new movie shooting) ప్రారంభమవుతుందని సాయిధరమ్ తేజ్ తెలిపారు. ఇక.. గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.