సీఎం జగన్‌ చెప్పే మాటల్లో ఉన్న తియ్యదనం చేతల్లో కనిపించట్లేదు: ఏరాసు ప్రతాప్​రెడ్డి - మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌ రెడ్డి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 12, 2023, 3:48 PM IST

Updated : Dec 12, 2023, 4:53 PM IST

EX- Minister Erasu Prathap Reddy Fires On YSRCP Government : మిగ్‌జాం తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో జగన్‌ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌ చెప్పే మాటల్లో ఉన్న తియ్యదనం చేతల్లో కనిపించట్లేదని దుయ్యబట్టారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను టీడీపీ బృందంతో కలిసి ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతులను తక్షణమే సీఎం జగన్‌ ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Michaung Effect In Ongole District : పంట నష్టపోయి దిక్కుతోచని స్థితిలో కన్నీరు పెడుతున్న రైతన్నలను ఆదుకునే పరిస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను జగన్మోహన్​రెడ్డి ఆదుకోకపోతే ఫలితం అనుభవిస్తారని అన్నారు. రానున్న మూడు నెలల టీడీపీ ప్రభుత్వం కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం తప్పకుండా అందిస్తామని భరోసా ఇచ్చారు. నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Last Updated : Dec 12, 2023, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.