thumbnail

Double Decker Train Derailed: పట్టాలు తప్పిన డబుల్‌ డెక్కర్‌ రైలు

By

Published : May 15, 2023, 7:32 PM IST

Double Decker Train Derailed: చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్న డబుల్‌ డెక్కర్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. చెన్నై - బెంగళూరు మార్గంలో ప్రయాణిస్తున్న ఈ రైలు.. చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు బిసానత్తం వద్దకు రాగానే డబుల్‌ డెక్కర్‌ రైలు పట్టాలు తప్పింది. బిసానత్తం స్టేషన్ వద్ద రైలు పక్కకి ఒరిగి ఉండటంతో లోకోపైలట్‌ వెంటనే అప్రమత్తమై.. చాకచక్యంగా వ్యవహరించారు. పరిస్థితిని గమనించి రైలును నిలిపివేశారు. ఎవరికీ ఏం కాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.  

ఈ ఘటనతో ఆ రూట్​లో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఈ రైలును క్రమబద్ధీకరించేందుకు రైల్వే అధికారులు తగు చర్యలను తీసుకున్నారు. డబుల్‌ డెక్కర్‌ ట్రైన్ పట్టాలు తప్పడంతో చెన్నై - బెంగళూరు మార్గంలో పలు ట్రైన్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  బృందావన్‌ ఎక్స్‌ప్రెస్‌ను కుప్పం రైల్వే స్టేషన్‌ సమీపంలో.. అదే విధంగా బెంగళూరు కంటోన్మెంట్‌ స్పెషల్‌ ట్రైన్​ను తమిళనాడులోని జోలారుపేట జంక్షన్‌లో నిలపి వేశారు. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.