అర్ధరాత్రి టీడీపీ కార్యాలయంపై దుండగుల దాడి - బండ రాళ్లు, ఇనుప రాడ్లతో కార్లు, సామగ్రి ధ్వంసం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 1:06 PM IST

thumbnail

Attack on TDP Office in Prasadampadu : విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దుండగులు దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. అర్ధరాత్రి మూడు గంటల సమయంలో బండ రాళ్లు, ఇనుపరాడ్లతో దుండగులు కార్యాలయం ఆవరణలోని కార్లు, సామగ్రిని ధ్వంసం చేసి అక్కడి నుంచి పరారయ్యారు. శుక్రవారం జరిగిన టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం కావటంతో ఎమ్మెల్యే వంశీ అనుచరులే ఈ దాడికి తెగబడ్డారని టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు.

Attack on TDP Party Office : టీడీపీకి పెరిగిన ప్రజాాదరణ ఓర్వలేకే ఇటువంటి దాడులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఇలా అర్ధరాత్రి ఎవ్వరూ లేని సమయంలో టీడీపీ కార్యాలంయంపై దాడి చేయటం పిరికిపంద చర్య అని యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు. ఈ ఘటనపై స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు ఎమ్మెల్యే వంశీపై విమర్శలు గుప్పించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.