ట్రైన్పైకి ఎక్కిన యువకుడికి కరెంట్ షాక్ - ఛత్తీస్గఢ్ ఎక్స్ప్రెస్ వీడియో
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16750699-thumbnail-3x2-kkk.jpg)
ఛత్తీస్గఢ్లో ఓ యువకుడి దుస్సాహసం అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో దుర్గ్ రైల్వే స్టేషన్లో ఉన్న ఛత్తీస్గఢ్ ఎక్స్ప్రెస్ పైకి అతడు ఎక్కాడు. చుట్టుపక్కల ఉన్నవారు, రైల్వే పోలీసులు ఎంత చెప్పినా వినకుండా పైన నిల్చున్నాడు. అతడ్ని కిందకు దించేలోపే హైటెన్షన్ విద్యుత్ వైర్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన యువకుడిని జీఆర్పీ పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా మారడం వల్ల వైద్యులు రాయ్పుర్కు పంపారు. ఆ యువకుడ్ని.. జాంజ్గిర్ ప్రాంతానికి చెందిన రవిగా గుర్తించారు. క్షతగాత్రుడు పంజాబ్లో కూలీగా పని చేసేవాడని, దీపావళికి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST